కరోనా క్రైసిస్.. అంతర్జాతీయ దర్యాప్తులో చేతులు కలిపిన ఇండియా

| Edited By: Anil kumar poka

May 18, 2020 | 11:41 AM

కరోనా వైరస్ క్రైసిస్, దీన్ని   ప్రపంచ ఆరోగ్య సంస్థ 'హాండిల్' చేస్తున్న తీరుపై నిష్పాక్షిక, స్వతంత్ర, సమగ్ర దర్యాప్తునకు 62 దేశాలు సమాయత్తమయ్యాయి. ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ చొరవతో చేపడుతున్న ఈ దర్యాప్తులో చేతులు కలిపేందుకు...

కరోనా క్రైసిస్.. అంతర్జాతీయ దర్యాప్తులో చేతులు కలిపిన ఇండియా
Follow us on

కరోనా వైరస్ క్రైసిస్, దీన్ని   ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘హాండిల్’ చేస్తున్న తీరుపై నిష్పాక్షిక, స్వతంత్ర, సమగ్ర దర్యాప్తునకు 62 దేశాలు సమాయత్తమయ్యాయి. ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ చొరవతో చేపడుతున్న ఈ దర్యాప్తులో చేతులు కలిపేందుకు ఇండియా కూడా అంగీకరించింది. 73 వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం సోమవారం నుంచి జెనీవాలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ దర్యాప్తునకు సంబంధించిన ముసాయిదా తీర్మానాన్ని రూపొందించారు. ‘ఇంపార్షియల్, ఇండిపెండెంట్, కాంప్రెహెన్సివ్ ప్రోబ్ (ఇన్వెస్టిగేషన్) పేరిట ఈ తీర్మానాన్ని వ్యవహరిస్తున్నారు. ఈ పాండమిక్ అదుపునకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి చర్యలు చేపడుతున్నదీ, చేపట్టాలనుకుంటున్నదీ తదితర అన్ని అంశాలపైనా ఈ దర్యాప్తు సాగుతుందని అంటున్నారు. కరోనా ఔట్ బ్రేక్ పై దర్యాప్తు జరగాలని గత నెలలో ఆస్ట్రేలియా దేశమే మొదటిసారిగా డిమాండ్ చేసింది. ఒక దశలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇలాగే డిమాండ్ చేసిన విషయం గమనార్హం. కాగా ఈ ముసాయిదా తీర్మానంలో చైనా దేశాన్ని గానీ , వూహాన్ సిటీని గానీ పేర్కొనలేదు. యూరోపియన్ యూనియన్ మద్దతుతో రూపొందించిన ఈ ముసాయిదా తీర్మానంపై జపాన్, బ్రిటన్, న్యూజిలాండ్, సౌత్ కొరియా, బ్రెజిల్, కెనడా దేశాలతో సహా పలు దేశాలు సంతకాలు చేశాయి.