తమిళనాడులో కస్టోడియల్ డెత్స్.. నలుగురు పోలీసుల అరెస్ట్

| Edited By: Pardhasaradhi Peri

Jul 02, 2020 | 11:42 AM

తమిళనాడు ట్యుటికోరన్ లో తండ్రీ కొడుకులు జయరాజ్, బెనిక్స్ ల మర్డర్ కేసులో నలుగురు పోలీసులను అరెస్టు చేశారు. శ్రీధర్, రఘుగణేష్, బాలకృష్ణన్, మురుగన్ లను సీఐడీ అధికారులు అరెస్టు చేసి ఐపీసీ లోని వివిధ సెక్షన్ల..

తమిళనాడులో కస్టోడియల్ డెత్స్.. నలుగురు పోలీసుల అరెస్ట్
Follow us on

తమిళనాడు ట్యుటికోరన్ లో తండ్రీ కొడుకులు జయరాజ్, బెనిక్స్ ల మర్డర్ కేసులో నలుగురు పోలీసులను అరెస్టు చేశారు. శ్రీధర్, రఘుగణేష్, బాలకృష్ణన్, మురుగన్ లను సీఐడీ అధికారులు అరెస్టు చేసి ఐపీసీ లోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. వీరి అరెస్టుకు అనువుగా ఎఫ్ఐ ఆర్ లను మార్చినట్టు సీబీ సీఐడీ అధికారులు తెలిపారు. రఘు గణేష్, బాలకృష్ణన్ అనే ఇద్దరు ఎస్ఐ లతో బాటు ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఎఫ్ ఐ ఆర్ లను మార్చినట్ట్టు ఐజీ తెలిపారు. వీరిపై హత్యాభియోగాలను మోపినట్టు ఆయన చెప్పారు. పోలీసులు గతంలో ఈ ఘటనను కేవలం అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నారు. కాగా ట్యుటికోరన్ పోలీసు విభాగం నుంచి ఈ కేసును తీసుకోవాలని, తాజా విచారణ అనంతరం సీబీఐకి అప్పగించాలని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఆదేశించింది.