వికాస్ దూబే ఎన్ కౌంటర్ సీన్.. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు..

| Edited By: Pardhasaradhi Peri

Jul 19, 2020 | 11:07 AM

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ జరిగిన స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు శనివారం సందర్శించారు. జులై 10 న జరిగిన ఆ ఘటనకు సంబంధించి తిరిగి సీన్ 'రీక్రియేట్'చేశారు. ఆ రోజున ఉజ్జయిని నుంచి పోలీసులు దూబేను కాన్పూర్..

వికాస్ దూబే ఎన్ కౌంటర్ సీన్.. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు..
Follow us on

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ జరిగిన స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు శనివారం సందర్శించారు. జులై 10 న జరిగిన ఆ ఘటనకు సంబంధించి తిరిగి సీన్ ‘రీక్రియేట్’చేశారు. ఆ రోజున ఉజ్జయిని నుంచి పోలీసులు దూబేను కాన్పూర్ కి తీసుకువెళ్తుండగా.. మధ్యదారిలో ఆ వాహనం బోల్తా పడడంతో దూబే తప్పించుకుని పారిపోబోతూ పోలీసులపై కాల్పులు జరపడం, వారి ఎదురుకాల్పుల్లో ఆ కిల్లర్ గాయపడి మరణించడం తెలిసిందే. కాగా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో సీనియర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు ఇక్కడ తిరిగి సీన్  క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా ఆ రోజున అక్కడే ఉన్న పలువురు పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది కూడా అక్కడ హాజరయ్యారు. తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు.