జేడీ-యూ వైపు బీహార్ మాజీ డీజీపీ చూపు !

| Edited By: Balu

Sep 26, 2020 | 4:33 PM

బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే శనివారం సీఎం నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. దీంతో ఆయన పాలక జేడీ-యూ లో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్ర పోలీసు విభాగం నుంచి ఆయన స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు..

జేడీ-యూ వైపు బీహార్ మాజీ డీజీపీ చూపు !
Follow us on

బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే శనివారం సీఎం నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. దీంతో ఆయన పాలక జేడీ-యూ లో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్ర పోలీసు విభాగం నుంచి ఆయన స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. తాను జేడీ-యూలో చేరాలా వద్దా అన్న విషయమై ఇంకా  నిర్ణయం తీసుకోలేదని, అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉందని సూచనప్రాయంగా చెప్పారు. తన బక్సర్ నియోజకవర్గ ప్రజలు తనను ఇక్కడినుంచి పోటీ చేయాలని కోరుతున్నారని, దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని గుప్తేశ్వర్ పాండే చెప్పారు.  ఈ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.