మన్మోహన్ సింగ్ మాజీ సలహాదారుకే ‘టోపీ’ !

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2020 | 6:58 PM

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఒకప్పుడు మీడియా అడ్వైజర్ అయిన సంజయ్ బారు ఛీటింగ్ కి గురయ్యారు. ఆన్ లైన్ ఫ్రాడ్ లో 24 వేలు పోగొట్టుకున్నారు. ఓ మద్యం షాపు ఉద్యోగినని చెప్పుకున్న ఓ వ్యక్తికి లిక్కర్ కోసం  ఈ సొమ్ము చెల్లించారు. అయితే ఆ వ్యక్తి..

మన్మోహన్ సింగ్ మాజీ సలహాదారుకే టోపీ !
Follow us on

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఒకప్పుడు మీడియా అడ్వైజర్ అయిన సంజయ్ బారు ఛీటింగ్ కి గురయ్యారు. ఆన్ లైన్ ఫ్రాడ్ లో 24 వేలు పోగొట్టుకున్నారు. ఓ మద్యం షాపు ఉద్యోగినని చెప్పుకున్న ఓ వ్యక్తికి లిక్కర్ కోసం  ఈ సొమ్ము చెల్లించారు. అయితే ఆ వ్యక్తి ఎంతకీ స్పందించకపోవడంతో ఆయనకు అనుమానం కలిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాకీల కథనం ప్రకారం.. లాక్ డౌన్ సమయంలో మద్యం హోమ్ డెలివరీ కోసం సంజయ్ బారు సెర్చ్ చేయగా.. ‘లా కేవ్ వైన్స్ అండ్ స్పిరిట్స్’ అనే పేరిట ఓ ఓ షాపు యాడ్ కనిపించింది. ఆయన ఆ షాపు నెంబరుకు ఫోన్ చేయగా..ఒక వ్యక్తి ఆన్ లైన్ లో 24 వేలు ట్రాన్స్ ఫర్ చేయాలనీ కోరడంతో ఆయన అలాగే చేశారు. కానీ డబ్బు అందగానే ఆ వ్యక్తి తన ఫోన్ ని స్విచాఫ్ చేశాడట. సంజయ్ బారు కంప్లెయింట్ పై  పోలీసులు ఆ ఫోన్ నెంబరును ట్రాక్ చేసి సదరు వ్యక్తిని పట్టుకున్నారు. అతగాడు ఓ క్యాబ్ డ్రైవరని తెలిసింది. తన సహచరులు చాలామంది నకిలీ పేర్లు, చిరునామాలతో సిమ్ కార్డులను పొందుతారని, వివిధ రాష్ట్రాల్లో వారు వేర్వేరు బ్యాంకు అకౌంట్లను నిర్వహిస్తున్నారని ఆ డ్రైవర్ చెప్పాడు. మొత్తానికి ఈ రాకెట్ పెద్ద ఛీటింగ్ యవ్వారమే నడుపుతోందని తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.