ఇది విపత్కర సమయం.. మోదీకి మద్దతునిద్దాం.. చిదంబరం

| Edited By: Anil kumar poka

Mar 22, 2020 | 2:06 PM

కరోనా నివారణకు జనతా కర్ఫ్యూకు  పిలుపునిచ్చిన ప్రధాని మోదీకి అందరం మద్దతునిద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కోరారు.

ఇది విపత్కర సమయం.. మోదీకి మద్దతునిద్దాం.. చిదంబరం
Follow us on

కరోనా నివారణకు జనతా కర్ఫ్యూకు  పిలుపునిచ్చిన ప్రధాని మోదీకి అందరం మద్దతునిద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కోరారు. కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు, దేశ ఆర్ధిక వ్యవస్థను కొంతలో కొంతయినా పునరుజ్జీవింపజేసేందుకు వచ్ఛే ఆరు నెలలకు గాను 5 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రభుత్వం  ప్రకటించాలన్నారు. ఈ మేరకు ఓ ఇంగ్లీ ష్ డైలీకి ఇఛ్చిన ఆర్టికల్ లో ఆయన.. .. ఈ విపత్కర సమయంలో మోదీకి సపోర్టు ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని భావిస్తున్నానన్నారు. రానున్న రోజుల్లో మోదీ మరిన్ని సామాజిక, ఆర్ధిక పరమైన కఠిన చర్యలు తీసుకోవచ్ఛునని  చిదంబరం పేర్కొన్నారు. తాత్కాలికంగా దేశంలో అన్ని నగరాలూ, పట్టణాలను రెండు వారాల నుంచి నాలుగు వారాల వరకు లాక్ డౌన్ చేయాలని తను ఇదివరకే సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కరోనా మన దేశ ఎకానమీ పై తీవ్ర ప్రభావం చూపబోతోంది. అందువల్ల ప్రధాని, ప్రభుత్వం కూడా ఇప్పటినుంచే దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నా అని ఆయన అన్నారు.