మంటల్లో ఆరుగురు సజీవ దహనం

| Edited By:

Aug 06, 2019 | 9:32 AM

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది. జకీర్‌నగర్‌ ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో.. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జకీర్‌నగర్‌ ప్రాంతంలోని ఓ నాలుగంతస్తుల భవనంలో మంగళవారం తెల్లవారుజామున 2.00గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు మూడు […]

మంటల్లో ఆరుగురు సజీవ దహనం
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది. జకీర్‌నగర్‌ ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో.. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జకీర్‌నగర్‌ ప్రాంతంలోని ఓ నాలుగంతస్తుల భవనంలో మంగళవారం తెల్లవారుజామున 2.00గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో అంతా గాఢనిద్రలో ఉండటంతోనే ప్రాణనష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.