‘మా సత్తా చూడండి.. జస్ట్ శాంపిల్ మాత్రమే’…. బోర్డర్ లో చైనా దళాల దూకుడు

| Edited By: Pardhasaradhi Peri

Jun 07, 2020 | 8:00 PM

లడఖ్ లోని వాస్తవాధీన రేఖ పొడవునా ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత, చైనా మధ్య  మిలిటరీ స్థాయి చర్చలు జరిగిన మరుసటి రోజే చైనా ఆర్మీ…. ఆదివారం ఓ వీడియో విడుదల చేసింది. బోర్డర్ లో  వేలాది సైనికులు తాము వార్ కి రెడీ అన్నట్టు జరిపిన సన్నాహాలను ఈ వీడియో హైలైట్ చేసింది. గ్లోబల్ టైమ్స్ దీన్ని ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడం విశేషం. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు, పీఎల్ఏ ఎయిర్ […]

మా సత్తా చూడండి.. జస్ట్ శాంపిల్ మాత్రమే.... బోర్డర్ లో చైనా దళాల దూకుడు
Follow us on

లడఖ్ లోని వాస్తవాధీన రేఖ పొడవునా ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత, చైనా మధ్య  మిలిటరీ స్థాయి చర్చలు జరిగిన మరుసటి రోజే చైనా ఆర్మీ…. ఆదివారం ఓ వీడియో విడుదల చేసింది. బోర్డర్ లో  వేలాది సైనికులు తాము వార్ కి రెడీ అన్నట్టు జరిపిన సన్నాహాలను ఈ వీడియో హైలైట్ చేసింది. గ్లోబల్ టైమ్స్ దీన్ని ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడం విశేషం. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు, పీఎల్ఏ ఎయిర్ ఫోర్స్ దళాలు చేసిన మిలిటరీ విన్యాసాలను ఈ వీడియోలో చూపారు. సెంట్రల్ చైనాలోని హుబె ప్రావిన్స్ నుంచి వాయువ్య హై ఆల్టిట్యుడ్ రీజన్ వరకు కొన్ని గంటల పాటు ఇవి సాగాయి.