చంపేస్తామంటూ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కు బెదిరింపులు

| Edited By: Anil kumar poka

Aug 11, 2020 | 12:46 PM

యూపీలో ఉన్నావ్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కు బెదిరింపు కాల్ అందింది. అందులో మీతో బాటు మీ ఇంటినికూడా బాంబులతో పేల్చివేస్తామని గుర్తు తెలియని కాలర్ హెచ్ఛరించాడట.  దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సాక్షి మహారాజ్..

చంపేస్తామంటూ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కు బెదిరింపులు
Follow us on

యూపీలో ఉన్నావ్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కు బెదిరింపు కాల్ అందింది. అందులో మీతో బాటు మీ ఇంటినికూడా బాంబులతో పేల్చివేస్తామని గుర్తు తెలియని కాలర్ హెచ్ఛరించాడట.  దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సాక్షి మహారాజ్..పాకిస్థాన్ నుంచి తనకు ఈ కాల్ అందిందంటూ  ఆ ఫోన్ నెంబరును కూడా  తెలిపారు. మహమ్మద్ గఫార్ అనే వ్యక్తిని మీరు పోలీసులకు పట్టించారని, అతడు తన స్నేహితుడని ఆ అజ్ఞాత వ్యక్తి తెలిపాడని, ఇందుకు మీకు, మీ సహచరులకు ప్రాణహాని తప్పదని వార్నింగ్ ఇఛ్చాడని ఆయన పేర్కొన్నారు. 24 గంటలూ ముజాహిదీన్లు మిమ్మల్ని గమనిస్తుంటారని, అవకాశం లభించగానే వారు మిమ్మల్ని చంపడం ఖాయమని ఆ వ్యక్తి బెదిరించాడని ఆయన వెల్లడించారు.

‘ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్లను కూడా ఆ కాలర్ ప్రస్తావించాడు.. ‘గవా-ఎ-హింద్’ పేరిట ఇండియాలో ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నాడు’ అని సాక్షిమహరాజ్ తన ఫిర్యాదులో వెల్లడించారు. గతంలో కూడా తనకు పలు ఉగ్రవాద సంస్థలనుంచి ఇలాంటి బెదిరింపులు అందాయన్నారు.