National News: మా పార్టీ నేతల జోలికొస్తే కళ్లు పీకేస్తాం.. చేతులు నరికేస్తాం.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..

|

Nov 06, 2021 | 8:07 PM

కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఏడాదిగా నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్నదాతల నిరసనలపై ఇటీవల కొందరు బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు..

National News: మా పార్టీ నేతల జోలికొస్తే కళ్లు పీకేస్తాం.. చేతులు నరికేస్తాం.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
Follow us on

కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఏడాదిగా నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్నదాతల నిరసనలపై ఇటీవల కొందరు బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత, మాజీ మంత్రి మనీశ్‌ గ్రోవర్‌ శుక్రవారం రోహ్‌తక్‌ జిల్లాలోని ఓ గ్రామంలోని ఆలయానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఆయనను చుట్టుముట్టారు. దీంతో ఆయన రైతులపై నోరుపారేసుకున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు పని లేని తాగుబోతులని విమర్శించారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు బీజేపీ నేతలను గుడిలోనే నిర్బంధించారు. గ్రోవర్‌ క్షమాపణలు చెప్పాలని సుమారు 8 గంటల పాటు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అయితే ఎట్టకేలకు ఆయన బయటకు రాగలిగారు.

కాగా శనివారం జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అరవింద్‌ శర్మ ఈ సంఘటనపై స్పందించారు. ‘మనీశ్‌ను వ్యతిరేకంగా మాట్లాడిన వారి కనుగుడ్లు పీకేస్తాం.. చేతులు నరికేస్తాం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్‌ నేతలపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. తాము మరో 25 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని, కాంగ్రెస్‌ నేతలు చక్కర్లు కొట్టూ జీవించాల్సిందేనని ఎంపీ మండిపడ్డారు. కాగా బాధ్యతగల ఓ ఎంపీ అందులోనూ ఓ బహిరంగ కార్యక్రమంలో ఇలా మాట్లాడడం చర్చనీయాంశమైంది.

Also Read:

National News: ఆశారాం బాపుకు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స చేస్తున్న డాక్టర్లు..

Fact Check: శరీరంలో బొద్దింక.. ఈ వార్తలో నిజమెంతా.. పూర్తి వివరాలు..

Viral News: తాగి ఇంకొకరి ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. రక్తం వచ్చేలా కొట్టిన యజమాని