బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోస్టర్ పై ఉమ్మివేసిన దుండగులు, శుభ్రం చేసిన బీజేపీ నేత

| Edited By: Anil kumar poka

Feb 02, 2021 | 11:18 AM

బెంగాల్ లోని సిలిగురిలో సీఎం మమతా  బెనర్జీ పోస్టర్ పై కొందరు దుండగులు  ఉమ్మివేయడం దిగ్భ్రాంతి కలిగించింది. అక్కడి భగాజతిన్ పార్క్ లో  తమ పార్టీ...

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోస్టర్ పై ఉమ్మివేసిన దుండగులు, శుభ్రం చేసిన బీజేపీ నేత
Follow us on

బెంగాల్ లోని సిలిగురిలో సీఎం మమతా  బెనర్జీ పోస్టర్ పై కొందరు దుండగులు  ఉమ్మివేయడం దిగ్భ్రాంతి కలిగించింది. అక్కడి భగాజతిన్ పార్క్ లో  తమ పార్టీ ఆధ్వర్యాన జరిగే సమావేశాలకు వెళ్తున్న పలువురు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు,  మద్దతుదారులు ఇది చూసి కూడా చూడనట్టు వెళ్లిపోవడం దారుణమని సిలిగురి జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్, లాయర్ కూడా అయిన అఖిల్ బిస్వాస్ అన్నారు. ఈ చర్యను ఖండించిన ఆయన.. ఈ అసభ్యాన్ని తట్టుకోలేక తానే మమత పోస్టర్ ని శుభ్రం చేశానని తెలిపారు. ఈ రాష్ట్రానికి మమతా బెనర్జీ గౌరవ ముఖ్యమంత్రి అన్న విషయాన్నీ విస్మరించరాదన్నారు. బెంగాల్ లో టీఎంసీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నప్పటికీ  ఒక బీజేపీ నేత ఇలా పార్టీలకు అతీతంగా స్పందించడం నెటిజన్లను కదిలించింది.

 

Read More: Rajya Sabha Session Reschedule: రాజ్యసభ సమావేశాలు రీషెడ్యూల్.. ఫిబ్రవరి 13తో ముగియనున్న సమావేశాలు

Read More: Farmers Protest: రైతులను తీసుకువెళ్తున్న రైళ్లను దారి మళ్లిస్తున్నారు, అన్నదాతల సంఘాల ఆగ్రహం.