బీహార్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ. సీఎం నితీష్ కుమార్ వరాల వెల్లువ

| Edited By: Anil kumar poka

Sep 26, 2020 | 11:47 AM

బీహార్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సీఎం నితీష్ కుమార్ ఏడు పాయింట్ల ఫార్ములాను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే హయ్యర్ సెకండరీ పరీక్షలు ఉత్తీర్ణులైన విద్యార్థినులకు 25 వేలు,..

బీహార్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ. సీఎం నితీష్ కుమార్ వరాల వెల్లువ
Follow us on

బీహార్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సీఎం నితీష్ కుమార్ ఏడు పాయింట్ల ఫార్ములాను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే హయ్యర్ సెకండరీ పరీక్షలు ఉత్తీర్ణులైన విద్యార్థినులకు 25 వేలు, గ్రాడ్యుయేషన్ చేసినవారికి 50 వేలు ఆర్ధిక సాయం చేస్తామన్నారు. వృధ్ధులకు,  పట్టణ పేదలకు బహుళ అంతస్థుల షెల్టర్ హోమ్స్ నిర్మిస్తామన్నారు. అన్ని ఐటీలు, టౌన్లలో స్టామ్ వాటర్ డ్రైనేజీ సిస్టంలు  ఏర్పాటయ్యేలా  చూస్తానని, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని విద్యుత్ దహనవాటికలు, హెల్త్ కేర్ కేంద్రాలు ఏర్పాటు కావడం ఖాయమని నితీష్ కుమార్ పేర్కొన్నారు. ఇంకా ఇలాగే మరిన్ని తాయిలాలను ఆయన ప్రకటించారు.