Delhi CAA Clashes: ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మృతి వెనుక ఆప్ ?

|

Feb 27, 2020 | 5:01 PM

ఢిల్లీలో జరిగిన అల్లర్లలోఇంటెలిజెన్స్ బ్యూరో  అధికారిఅంకిత్ శర్మ మృతి వెనుక ఆప్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పార్టీకి చెందిన తాహిర్ హుసేన్ అనే మున్సిపల్ కౌన్సిలర్ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది.

Delhi CAA Clashes: ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మృతి వెనుక ఆప్ ?
Follow us on

Delhi CAA Clashes: ఢిల్లీలో జరిగిన అల్లర్లలోఇంటెలిజెన్స్ బ్యూరో  అధికారిఅంకిత్ శర్మ మృతి వెనుక ఆప్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పార్టీకి చెందిన తాహిర్ హుసేన్ అనే మున్సిపల్ కౌన్సిలర్ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. అల్లర్లు పెద్దఎత్తున జరిగిన నార్త్ ఈస్ట్ ఢిల్లీలో అంకిత్ శర్మ మృతదేహాన్ని ఓ కాలువలో కనుగొన్న సంగతి తెలిసిందే. ఆయనను ఓ గుంపు కొట్టి చంపి డెడ్ బాడీని కాలువలో పడవేసినట్టు వఛ్చిన వార్తలు   .సంచలనం రేపాయి. ఆప్ నేత తాహిర్ హుసేన్ సహచరులే తన కుమారుడిని హతమార్చారని   అంకిత్ శర్మ తండ్రి రవీందర్ శర్మ ఆరోపించారు. అటు-హుసేన్ కి చెందిన ఐదంతస్థుల భవనంపై నుంచి హుసేన్ సహచరుల్లో కొందరు రాళ్లు, పెట్రోలు బాంబులు విసిరినట్టు అంకిత్ శర్మ ఇంటిచుట్టుపక్కలవారు తెలిపారు. ఈ ఆరోపణలను నిరూపించేందుకా అన్నట్టు కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి. వీటిలో హుసేన్ గా భావిస్తున్న వ్యక్తి ఈ భవనంపైనుంచి కొంతమందితో కలిసి రాళ్లు విసిరినట్టు కనిపించింది. ఆ వ్యక్తి చేతిలో లాఠీ కూడా ఉంది. అయితే తాను అమాయకుడినని, తనపై వఛ్చిన ఆరోపణలు నిరాధారమని తాహిర్ హుసేన్ తన ట్విటర్ ద్వారా పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా విద్వేషపూరిత ప్రసంగాలే అల్లర్లను రెచ్ఛగొట్టాయన్నారు. తన ఇంటి వద్ద కూడా ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారని, నిజానికి తాను హిందూ.ముస్లిం ల మధ్య మంచి సాన్నిహిత్యాన్ని కోరే వ్యక్తినని ఆయన అన్నారు. హిందూ-ముస్లిముల సన్నిహిత సంబంధాల కోసం తాను ఎప్పుడూ పాటు పడుతూ ఉంటానని హుసేన్ పేర్కొన్నారు.