Diabetes: పిల్లల్లో పెరుగుతున్న డయాబెటిస్.. లేటెస్ట్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు

|

Mar 27, 2024 | 6:36 PM

కోవిడ్ తర్వాత ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. అయితే లాక్డౌన్ కారణంగా చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా పిల్లల్లో ఉబకాయం పెరిగిపోతోంది. అయితే ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకున్నప్పటికీ, వ్యాధుల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే మనదేశంలో డయాబెటిస్ కేసులు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి. కానీ పిల్లలు కూడా ఈ వ్యాధికి గురవుతున్నారు. దీనికి కారణం పిల్లలలో పెరుగుతున్న స్థూలకాయం. ఇటీవల కాలంలో పిల్లలో మధుమేహం కేసులు 30 శాతం చొప్పున పెరగడం తల్లిదండ్రుల్లో ఆందోళన […]

Diabetes: పిల్లల్లో పెరుగుతున్న డయాబెటిస్.. లేటెస్ట్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు
Follow us on

కోవిడ్ తర్వాత ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. అయితే లాక్డౌన్ కారణంగా చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా పిల్లల్లో ఉబకాయం పెరిగిపోతోంది. అయితే ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకున్నప్పటికీ, వ్యాధుల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే మనదేశంలో డయాబెటిస్ కేసులు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి. కానీ పిల్లలు కూడా ఈ వ్యాధికి గురవుతున్నారు. దీనికి కారణం పిల్లలలో పెరుగుతున్న స్థూలకాయం. ఇటీవల కాలంలో పిల్లలో మధుమేహం కేసులు 30 శాతం చొప్పున పెరగడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.

పిల్లల్లో మధుమేహం కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఊబకాయం అని వైద్యుడు జుగల్ కిషోర్ చెప్పారు. అయితే పిల్లల ఆహార అలవాట్ల కారణంగానే ఊబకాయం వస్తుందని డాక్టర్లు భావిస్తున్నారు. ఇక పిల్లలు అతిగా తినడం అలవాటు ఊబకాయనికి కారణమవుతుంది. అయితే కోవిడ్, లాక్ డౌన్ కారణంగా పిల్లలు బయటకు వెళ్లకపోవడంతోనే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తేల్చి చెప్పారు.

ఊబకాయం పెరగాడానికి కారణం ఇదే: పిల్లల్లో స్థూలకాయానికి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణం అవుతున్నాయి. ఈతరం పిల్లలు ఇంటి ఆహారానికి బదులు బయట జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఇక వేయించిన ఫుడ్స్ తో పాటు చల్లని కూల్ డ్రింక్స్ తీసుకోవడం కూడా ఊబకాయం పెరుగుతోంది. కోవిడ్‌కి ముందు పిల్లలు స్నేహితులతో బయట ఆడుకోవడానికి ఇష్టపడేవారు. అయితే కోవిడ్ తర్వాత పిల్లలో ఫోన్‌లో ఆటలు ఆడే అలవాటు పెరిగింది, దీని కారణంగా శారీరక శ్రమ తగ్గింది. ఎక్కువ సమయం ఫోన్స్, టీవీలతో గడపడం కూడా మరో కారణం

పరిశోధన ఏం చెబుతోంది: పిల్లల్లో స్థూలకాయం పెరగడం అనేక సమస్యలకు దారితీస్తోందని, చిన్నవయసులోనే స్థూలకాయానికి గురవుతున్నారని, వాటి కారణంగా జీవక్రియలు మందగించాయని, కొలెస్ట్రాల్‌ కు దారి తీస్తోందని అంటున్నారు. పిల్లల్లో ఫ్యాటీ లివర్ సమస్య కూడా పెరుగుతోంది. అంతే కాకుండా పిల్లల్లో స్థూలకాయం పెరగడం టైప్-2 మధుమేహానికి, ఊబకాయం కారణంగా పిల్లల్లో, రక్తంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటి అనారోగ్య సమస్యల బారిన పడటం కనిపిస్తుంది.

ఇవి అవసరం : పిల్లల బరువుకు చెక్ పెట్టడానికి పౌష్టికాహారం అవసరం. జంక్ ఫుడ్, వేయించిన ఫుడ్స్ దూరంగా ఉండటం. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలను ఆడుకునేలా ఎంకరేజ్ చేస్తే శారీరక శ్రమ పెరుగుతుంది.