భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 10 గంటలకే ఎండలు దంచికొడుతున్నాయి. కాలు అడుగుతీసి బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యల్లో తలనొప్పి ఒకటి. ఎండ తీవ్రత కారణంగా డీహైడ్రేషన్కు గురికావడం సర్వసాధారణం. దీనివల్ల తలనొప్పి సమస్య వేధిస్తుంటుంది. అయితే సమ్మర్లో వచ్చే తలనొప్పి సమస్యకు కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా చెక్ పెట్టొచ్చు. తలనొప్పి దూరం చేసే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* డ్రైఫ్రూట్స్ నేచురల్ పెయిన్ కిల్లర్స్లాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులతో నొప్పికి ఫుల్స్టాప్ పెట్టొచ్చు. ప్రతీ రోజూ డ్రైఫ్రూట్స్ తీసుకుంటే తలనొప్పి సమస్య ఇట్టే దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
* ఇక అల్లం కూడా తలనొప్పికి చెక్ పెట్టొచ్చు. ఇందుకోసం కొన్ని గోరు వెచ్చని నీటిలో అల్లం రసం వేసుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
* సమ్మర్లో వీలైనంత వరకు మసాలా ఫుడ్ను తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల డీహైడ్రేషన్ సమస్య పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
* ఇక సమ్మర్లో తలనొప్పికి ప్రధాన కారణాల్లో డీహైడ్రేషన్ ఒకటి. అందుకే క్రమతప్పకుండా నీటిని తీసుకుంటూ ఉండాలి. కేవలం నీరు మాత్రమే కాకుండా మజ్జిగా, నిమ్మరసం వంటివి అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.
* సమ్మర్లో ప్రతీ రోజు రాత్రి పడుకునే ముందు అరటి పండు తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉదయం పూట వచ్చే తలనొప్పి సమస్యకు చెక్ పెట్టొచ్చు.
* ఇక ఎండలో బయటకు వెళ్లే సమయంలో కచ్చితంగా క్యాప్ ధరించాలి. మధ్యాహ్నం పూట బయటకు రాకుండా ఉండడమే మంచిది. అలాగే బయటకు వెళ్లే సమయంలో కచ్చితంగా వెంట నీటిని తీసుకెళ్లాలి.
* సమ్మర్లో తలనొప్పి రావడానికి నిద్రలేమి కూడా ఒక కారణంగా చెబుతుంటారు. కాబట్టి మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలి. కనీసం 8 గంటలు నిద్ర పోవాలని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..