‘మీరు మహారాష్ట్రీయులు కారు’, సంజయ్ రౌత్ పై కంగనా ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Sep 07, 2020 | 10:36 AM

శివసేన నేత సంజయ్ రౌత్ పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మళ్ళీ మండిపడింది. మీరు మహారాష్ట్రకు చెందినవారు కారని, తన నుంచి క్షమాపణ కోరే హక్కు ఆయనకు లేదని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది...

మీరు మహారాష్ట్రీయులు కారు, సంజయ్ రౌత్ పై కంగనా ఫైర్
Follow us on

శివసేన నేత సంజయ్ రౌత్ పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మళ్ళీ మండిపడింది. మీరు మహారాష్ట్రకు చెందినవారు కారని, తన నుంచి క్షమాపణ కోరే హక్కు ఆయనకు లేదని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. మీ మైండ్ సెట్ మహిళలకు వ్యతిరేకంగా ఉందని మండిపడుతూ ఓ వీడియో మెసేజ్ ని ఆమె విడుదల చేసింది. సంజయ్ ఓ ఇంటర్వ్యూలో తనను మాత్రమే విమర్శించారని,  నివసించడానికి ముంబై సురక్షితమైనది కాదని లోగడ ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్ షా వంటి నటులు చేసిన వ్యాఖ్యలను మాత్రం  మీరు పట్టించుకోలేదని ఆమె దుయ్యబట్టింది. కంగనా…. సారీ (ఆపాలజీ) చెబితే ఆమెను ముంబైలో అడుగు పెట్టనిస్తామని సంజయ్ రౌత్ చేసిన హెచ్ఛరికలను ఆమె ప్రస్తావిస్తూ.. నేనెందుకు సారీ చెప్పాలని ప్రశ్నించింది. ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు, స్వేఛ్చ తనకు ఉన్నాయని కంగనా పేర్కొంది. సుశాంత్ కేసును ముంబై పోలీసులు సరిగా హ్యాండిల్ చేయలేదని కూడా ఆమె తీవ్రంగా ఆరోపించారు.