మహాబలిపురానికే చైనా నేత రాక.. ఎందుకు ?

| Edited By: Srinu

Oct 10, 2019 | 4:10 PM

ప్రధాని మోదీతో సమావేశమయ్యేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఈ నెల 11 న తమిళనాడులోని మహాబలిపురానికి వస్తున్నారు. అక్కడ రెండు రోజులపాటు వీరి ఫార్మల్ సమ్మిట్ జరగనుంది. అయితే వీరి భేటీకి అసలు తమిళ వారసత్వానికి ప్రతిరూపమైన మహాబలిపురాన్నే ఎంచుకోవడానికి కారణం ? మన దేశంలోని వివిధ టూరిస్టు డెస్టినేషన్లు ఇతర దేశాల ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తాయని, ఇలాంటి చోట్ల టాప్ గ్లోబల్ లీడర్లతో ముఖ్యమైన సమావేశాలు నిర్వహించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని […]

మహాబలిపురానికే చైనా నేత రాక.. ఎందుకు ?
Follow us on

ప్రధాని మోదీతో సమావేశమయ్యేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఈ నెల 11 న తమిళనాడులోని మహాబలిపురానికి వస్తున్నారు. అక్కడ రెండు రోజులపాటు వీరి ఫార్మల్ సమ్మిట్ జరగనుంది. అయితే వీరి భేటీకి అసలు తమిళ వారసత్వానికి ప్రతిరూపమైన మహాబలిపురాన్నే ఎంచుకోవడానికి కారణం ? మన దేశంలోని వివిధ టూరిస్టు డెస్టినేషన్లు ఇతర దేశాల ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తాయని, ఇలాంటి చోట్ల టాప్ గ్లోబల్ లీడర్లతో ముఖ్యమైన సమావేశాలు నిర్వహించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని మోదీ భావిస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానుల రాకతో ఈ పర్యాటక ప్రదేశాలు ఎంతో పాపులర్ అవుతాయన్నది ఆయన నమ్మకం. పైగా ఆయా దేశాల ప్రజల మధ్య స్నేహ, సౌభ్రాత్రాలకు కూడా ఈ విధమైన టూరిస్టు ప్రాంతాలు ఉపకరిస్తాయని ఆయన తరచూ అంటుంటారు. బహుశా ఈ కారణంగానే మోదీ.. 2017 ఏప్రిల్ లో.. కోల్ కతా లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వాజెద్ తో సమావేశమయ్యారు. అదే ఏడాది గుజరాత్ లోని శబర్మతీ నదీ తీరంలో భారత-చైనా సమ్మిట్ జరిగింది. దేశంలో అత్యద్భుత శిల్ప కళకు, ఆలయాలకు మారుపేరైన మహాబలిపురంలో మోదీ-జీ జిన్ పింగ్ భేటీ వ్యూహం వెనుక ఓ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది.
క్రీ.శ. ఏడో శతాబ్దంలో పల్లవ వంశస్థుల రాచరిక పాలనలో మొదటి నరసింహవర్మన్ ఈ నగరాన్ని నిర్మించాడు. చెన్నైకి సుమారు యాభై కి.మీ. దూరంలోని ఈ సిటీ.. ఇతర దేశాలతో వ్యాపార లావాదేవీలకు అనువుగా ఉండేది. అందువల్లే ఆ పల్లవ రాజు ఇక్కడ రేవును కూడా నిర్మించాడు. నాడు పల్లవులు తమ రాయబారులను ముఖ్యంగా చైనాకు పంపేవారు. ఆ సమయంలో భారత-చైనా దేశాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటూ వచ్చింది. అరబ్బులు, టిబెటన్ల విషయంలో చైనా పాలకులకు రెండో నరసింహవర్మన్ కూడా తోడ్పాటు నందిస్తూ వచ్చాడు. పైగా ఒకనాడు చైనా ట్రావెలర్ హ్యూన్ త్సాంగ్ ఈ ప్రాంతంలో పర్యటించాడు.
అంటే దాదాపు రెండు వేల ఏళ్ళ నాటి నుంచే చైనా-భారత్ మధ్య లింకులున్నట్టు పురావస్తు ఆధారాలు కూడా లభించాయని చరిత్రకారులు అంటున్నారు. క్రీ.పూ. మొదటి, రెండో శతాబ్దంలో తమిళనాడు తీర ప్రాంతాల్లో సముద్ర జలాల ద్వారా చైనా-భారత దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు సాగేవట. అక్కడ నాడు లభించిన కుండలు, ఇతర మట్టి పాత్రలు ఈ విషయాన్నినిరూపించాయి. తమిళనాట నాడు చైనా నాణేలు దొరికాయని చెబుతున్నారు. ఇన్ని కారణాల వల్లే చైనా అధినేత జీ జిన్ పింగ్ కూడా ‘ సై ‘ అంటూ మహాబలిపురం విజిట్ కు ఓకె చెప్పినట్టు తెలుస్తోంది.