ఆరుగురు ఎంపీలతో రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్

| Edited By: Pardhasaradhi Peri

Jul 25, 2020 | 3:13 PM

రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆరుగురు ఎంపీలను సభ వైస్ చైర్మన్ ప్యానల్ కి ఎంపిక చేశారు. ఎల్.హనుమంతయ్య, (కాంగ్రెస్), భువనేశ్వర్ కలిత, సురేంద్ర సింగ్ (బీజేపీ), వందనా చవాన్ (ఎన్సీపీ), సుఖేందు శేఖర్ రాయ్ (తృణమూల్ కాంగ్రెస్), సస్మిత్ పాత్రా (బిజూ జనతాదళ్)లను..

ఆరుగురు ఎంపీలతో రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్
Follow us on

రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆరుగురు ఎంపీలను సభ వైస్ చైర్మన్ ప్యానల్ కి ఎంపిక చేశారు. ఎల్.హనుమంతయ్య, (కాంగ్రెస్), భువనేశ్వర్ కలిత, సురేంద్ర సింగ్ (బీజేపీ), వందనా చవాన్ (ఎన్సీపీ), సుఖేందు శేఖర్ రాయ్ (తృణమూల్ కాంగ్రెస్), సస్మిత్ పాత్రా (బిజూ జనతాదళ్)లను నియమించినట్టు రాజ్యసభ వర్గాలు తెలిపాయి. వీరిలో సస్మిత్ పాత్రా, హనుమంతయ్య మొదటిసారిగా ఈ ప్యానల్ సభ్యులయ్యారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లేనప్పుడు వీరిలో ఎవరో ఒకరు సభా చైర్మన్ గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్ లేరు. ఇప్పటివరకు ఈ పోస్టులో ఉన్న జనతాదళ్-యు సభ్యుడు హరివంశ్ రిటైరయ్యారు. అయితే ఆయన తిరిగి ఎన్నికైతే..ఎన్డీయే అభ్యర్థిగా నామినేట్ అవుతారు.