విగ్రహాలను, స్మారకాలను నాశనం చేస్తే ఖబడ్డార్ ! ట్రంప్ హెచ్ఛరిక

| Edited By: Pardhasaradhi Peri

Jun 27, 2020 | 4:31 PM

ఆందోళనకారుల నుంచి దేశంలోని  విగ్రహాలను, స్మారకాలను పరిరక్షించేందుకు తను కట్టుబడి ఉన్నానని, ఇందుకోసం 'కఠిన ఉత్తర్వులపై' సంతకం చేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ స్మారకాలు..

విగ్రహాలను, స్మారకాలను నాశనం చేస్తే ఖబడ్డార్ ! ట్రంప్ హెచ్ఛరిక
Follow us on

ఆందోళనకారుల నుంచి దేశంలోని  విగ్రహాలను, స్మారకాలను పరిరక్షించేందుకు తను కట్టుబడి ఉన్నానని, ఇందుకోసం ‘కఠిన ఉత్తర్వులపై’ సంతకం చేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ స్మారకాలు, విగ్రహాలను కాపాడుకోవలసిందే.. అందువల్ల క్రిమినల్ వయొలెన్స్ నుంచి వీటిని పరిరక్షిస్తాం అన్నారాయన. చట్టాన్ని అతిక్రమించే ఆందోళనకారులకు సుదీర్ఘ జైలు శిక్షలు తప్పవన్నారు. ఇటీవల వైట్ హౌస్ సమీపంలో మాజీ అధ్యక్షుడు ఏండ్రు జాక్సన్ విగ్రహాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేయడానికి యత్నించారు. ఆ విగ్రహాన్ని తాళ్లు, చైన్లతో కట్టి దాన్ని కిందికి పడగొట్టేందుకు ప్రయత్నించారు. గత మే 25 న నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి అనంతరం రేసిజానికి, పోలీసుల అమానుషత్వానికి నిరసనగా అనేకమంది ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విధమైన హింసాత్మక చర్యలను తాను సహించబోనని ట్రంప్  వార్నింగ్ ఇచ్చారు.  ప్రస్తుత చట్టాన్ని తన ఉత్తర్వులు మరింత బలోపేతం చేస్తాయన్నారు.

2003 లో ఆమోదించిన ‘వెటరన్స్’ మెమోరియల్ ప్రిజర్వేషన్ యాక్ట్’.. ఇలా దేశంలో స్మారకాలు, విగ్రహాలను ఎవరు ధ్వంసం చేసినా వారికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధించడానికి వీలు కల్పిస్తోంది. ఈ చట్టం కింద వారిని ప్రాసిక్యూట్ చేసేందుకు అటార్నీ జనరల్ కి విశేష అధికారాలు ఉంటాయి. ఫెడరల్ ఆస్తిని నాశనం చేయడానికి యత్నించిన నిరసనకారులను వెంటనే అరెస్టు చేయాలని  ట్రంప్.. అధికారులను ఆదేశించారు.