‘ట్విటర్ రాజా’ డొనాల్డ్ ట్రంప్, సెకండ్ జో బైడెన్, ఏడో స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ

| Edited By: Pardhasaradhi Peri

Dec 09, 2020 | 8:34 PM

ఈ ఏడాదికి గాను ట్విట్టర్లో జనాలు ఎవరిగురించి ఎక్కువగా ఆసక్తిగా ట్వీట్ చేశారంటే అది అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనేనట. ఆ తరువాతి స్థానం అధ్యక్షుడు కానున్న జో బైడెన్ కాగా ఏడో స్థానంలో..

ట్విటర్ రాజా డొనాల్డ్ ట్రంప్, సెకండ్ జో బైడెన్, ఏడో స్థానంలో ప్రధాని  నరేంద్ర మోదీ
Follow us on

ఈ ఏడాదికి గాను ట్విట్టర్లో జనాలు ఎవరిగురించి ఎక్కువగా ఆసక్తిగా ట్వీట్ చేశారంటే అది అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనేనట. ఆ తరువాతి స్థానం అధ్యక్షుడు కానున్న జో బైడెన్ కాగా ఏడో స్థానంలో ప్రధాని మోదీ ఉన్నారని ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ తన వార్షిక ‘ఇయర్ ఎండ్ రివ్యూ’లో తెలిపింది. 10 మంది టాప్ మోస్ట్ వ్యక్తుల్లో మోదీ 7 వ స్థానంలో ఉండగా అమెరికా ఉపాధ్యక్షురాలు కానున్న కమలా హారిస్ కి 10 వ స్థానం దక్కింది. ఈ సంవత్సరంలో ఏ రాజకీయ మార్పులు జరుగుతున్నాయి, ప్రపంచంలో ప్రస్తుత నేతల పరిస్థితి ఎలా ఉంది, అన్న అంశాలపై ట్విటరెట్లు ఎక్కువ ఆసక్తి చూపారు. ప్రపంచ వ్యాప్త ఎన్నికలపై 700 మిలియన్ ట్వీట్లు ‘ వెల్లివిరిశాయి’. గ్లోబల్ నేతల్లో ట్రంప్, జో బైడెన్, బరాక్ ఒబామా, మోదీ, కమలా హారిస్ గురించి ఎక్కువగా ట్వీట్లు దర్శనమిచ్చాయి.

ట్విటర్ కు సంబంధించిన కన్స్యూమర్ కమ్యూనికేషన్స్ గ్లోబల్ హెడ్ ట్రౌసీ మెక్ గ్రా తన బ్లాగ్ పోస్టులో ఈ విషయాలు వెల్లడించారు. ఇక ఈ ఏడాది హ్యాష్ ట్యాగుల్లో కోవిడ్ 19 ప్రథమ స్థానం ఆక్రమించింది. దీనికి 400 మిలియన్ ట్వీట్లు దక్కాయి. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (జార్జి ఫ్లాయిడ్ హత్య) కి రెండో హ్యాష్ ట్యాగ్ లభించింది. రాపర్ కాన్యే వెస్ట్, దివంగత బాస్కెట్ బాల్ ప్లేయర్ బ్రియంట్ కూడా హ్యాష్ ట్యాగుల్లో ఉన్నారు.