నవజాత శిశువుల మృతి దారుణం, మహారాష్ట్ర ఘటనపై ప్రధాని మోదీ షాక్, కుటుంబ సభ్యులకు సంతాపం

| Edited By: Anil kumar poka

Jan 09, 2021 | 10:37 AM

మహారాష్ట్రలోని భండారా జిల్లాలో గల  ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో 10 మంది నవజాత శిశువుల మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నవజాత శిశువుల మృతి దారుణం, మహారాష్ట్ర ఘటనపై ప్రధాని మోదీ షాక్, కుటుంబ సభ్యులకు సంతాపం
Follow us on

మహారాష్ట్రలోని భండారా జిల్లాలో గల  ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో 10 మంది నవజాత శిశువుల మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన అత్యంత దారుణమని, విలువైన జీవితాలు నాశనమయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన  సంతాపం తెలిపారు. ఈ ఆసుపత్రిలో  17 మంది శిశువులను  చేర్చారు. పొగతో ఉక్కిరిబిక్కిరై శ్వాస ఆడక వీరిలో 10 మంది మరణించారు. ఏడుగురు శిశువులను రక్షించారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. షార్ట్ సర్క్యూట్ ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే  దీనిపై విచారణకు ఆదేశించారు. కాగా…. హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా ఈ ఘటనపట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ ట్వీట్లు చేశారు.