సుశాంత్‌, రియా కలిసి గంజాయి సేవించేవారా?

|

Sep 03, 2020 | 4:46 PM

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఎపిసోడ్‌లో! సుశాంత్‌ మరణం తర్వాత రోజుకో ట్విస్టు తెరపైకి వస్తోంది.. సుశాంత్‌ మరణమేమోగానీ నటి రియా చక్రవర్తినైతే చంపుకు తింటున్నారు.. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, పరోక్షంగా అతడి చావుకు రియా చక్రవర్తే కారణమన్న అపవాదును వేస్తున్నారు.. ఇక ఇప్పుడు సుశాంత్‌ మేనేజర్‌ శ్రుతి మోదీ ఓ బాంబు పేల్చారు.

సుశాంత్‌, రియా కలిసి గంజాయి సేవించేవారా?
Follow us on

ఓ ఫక్తు కమర్షియల్‌ సినిమాకు కావల్సిన మసాలాలన్నీ ఉన్నాయి సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఎపిసోడ్‌లో! సుశాంత్‌ మరణం తర్వాత రోజుకో ట్విస్టు తెరపైకి వస్తోంది.. సుశాంత్‌ మరణమేమోగానీ నటి రియా చక్రవర్తినైతే చంపుకు తింటున్నారు.. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, పరోక్షంగా అతడి చావుకు రియా చక్రవర్తే కారణమన్న అపవాదును వేస్తున్నారు. ఇక ఇప్పుడు సుశాంత్‌ మేనేజర్‌ శ్రుతి మోదీ ఓ బాంబు పేల్చారు.. రియాకు కూడా గంజాయి సేవించే అలవాటు ఉందని శ్రుతి మోదీ సీబీఐకి తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి.. సుశాంత్‌తో పాటు అతడి హౌజ్‌ కీపింగ్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరండా, రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌లు కలిసి మిద్దమీద గంజాయి సేవించేవారని శ్రుతి సీబీఐతో చెప్పిందట! ఇలాగని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

మాదకద్రవ్యాల గురించి తన స్నేహితులతో రియా చక్రవర్తి ముచ్చటించిన వైనం వాట్సప్‌ చాట్‌ ద్వారా బయటకు వచ్చిన విషయం తెలిసిందే! ఇదే అదనుగా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో రియాపై కేసు పెట్టి విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే ముంబాయిలోని బాంద్రాకు చెందిన అబ్దుల్‌ బాసిత్‌ పరిహార్‌ను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది. డ్రగ్స్‌పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రియా చెప్పిన సంగతులకు ఇప్పుడు శ్రుతి మోదీ చెబుతున్న విషయాలకు అస్సలు పొంతన లేదు.. ఒకవేళ శ్రుతి చెప్పింది నిజమే అయితే రియాకు కష్టాలు తప్పవు. ఇక ఈరోజు సీబీఐ ఎదుట రియా తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తి హాజరయ్యారు.. సీబీఐ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నారు..