సుశాంత్ కేసులో నాకు తెలిసింది చెప్పాను, సంజయ్ రౌత్

| Edited By: Pardhasaradhi Peri

Aug 12, 2020 | 5:40 PM

సుశాంత్ కేసులో తనకు తెలిసింది చెప్పానని అన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. సుశాంత్ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారని, అందువల్ల ఆయనతోను, ఆ కుటుంబంతోనూ సుశాంత్ కి మంచి సంబంధాలు లేవని రౌత్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే.. దీంతో సుశాంత్ సమీప బంధువు, బీజేపీ ఎమ్మెల్యే కూడా అయిన నీరజ్ కుమార్ సింగ్.. ఆయనకు నోటీసును పంపుతూ.. ఈ వ్యాఖ్యలు చేసినందుకు 48 గంటల్లోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో లీగల్ చర్యను […]

సుశాంత్ కేసులో నాకు తెలిసింది చెప్పాను, సంజయ్  రౌత్
Follow us on

సుశాంత్ కేసులో తనకు తెలిసింది చెప్పానని అన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. సుశాంత్ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారని, అందువల్ల ఆయనతోను, ఆ కుటుంబంతోనూ సుశాంత్ కి మంచి సంబంధాలు లేవని రౌత్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే.. దీంతో సుశాంత్ సమీప బంధువు, బీజేపీ ఎమ్మెల్యే కూడా అయిన నీరజ్ కుమార్ సింగ్.. ఆయనకు నోటీసును పంపుతూ.. ఈ వ్యాఖ్యలు చేసినందుకు 48 గంటల్లోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో లీగల్ చర్యను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్ఛరించారు. దీనిపై స్పందించిన రౌత్..తానేదైనా మిస్ చేసి ఉంటే ఆ విషయాన్ని పరిశీలిస్తానని, తనకు అందిన సమాచారం ప్రకారమే అలా మాట్లాడానని అన్నారు. ఏమైనా.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేసే యత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇంకా వాదనలు సాగుతున్నాయి.