రాజస్థాన్ అసమ్మతి నేత సచిన్ పైలట్ ఢిల్లీ నుంచి మంగళవారం సాయంత్రం జైపూర్ చేరుకున్నారు. అదే సమయానికి సీఎం అశోక్ గెహ్లాట్ ఈ నగరానికి సుమారు 600 కి.మీ. దూరంలో ఉన్న జైసల్మీర్ లో ఉన్నారు. అక్కడి హోటల్ లో తనవర్గం ఎమ్మెల్యేలతో సమాలోచనలు జరుపుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతున్నప్పటికీ..వీరిద్దరూ భేటీ అయ్యే సూచనలు కనబడడంలేదు. తనకు జైపూర్ లోఎలాంటి గ్రాండ్ వెల్ కమ్ చెప్పవద్దని, అలాగే తన వర్గం ఎమ్మెల్యేలు కూడాఏ విధమైన అత్యుత్సాహానికీ పోరాదని సచిన్ పైలట్ సూచించినట్టు తెలుస్తోంది.
మరో వైవు కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు సీఎం అశోక్ గెహ్లాట్ ను వేర్వేరుగా కలుసుకుని తమకు మంత్రి పదవులు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయితే తనకు ఇప్పటివరకు విధేయులుగా ఉన్నవారిలో కొందరిని కూడా గెహ్లాట్ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.