వార్ కి రెడీగా ఉండండి, సేనలకు చైనా అధ్యక్షుని పిలుపు

| Edited By: Pardhasaradhi Peri

Oct 14, 2020 | 8:03 PM

అనుకున్నంతా అయింది. చైనా ఏకంగా యుధ్ధాన్ని ప్రకటించింది. లడాఖ్ లో భారత,చైనా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ సమర శంఖమూదారు. మంగళవారం గ్యాంగ్ డాంగ్ లోని మిలిటరీ బేస్ ను సందర్శించిన ఆయన.. యుధ్ధానికి సిద్ధంగా ఉండాల్సిదిగా పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీకి సూచించారు. అయితే అది ఇండియా మీదా కాదా అన్నది స్పష్టం కాలేదు. మన దేశానికి విధేయులుగా ఉండాలని, వార్ మీదే మీ శక్తిని, మనసును […]

వార్ కి రెడీగా ఉండండి, సేనలకు చైనా అధ్యక్షుని పిలుపు
Follow us on

అనుకున్నంతా అయింది. చైనా ఏకంగా యుధ్ధాన్ని ప్రకటించింది. లడాఖ్ లో భారత,చైనా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ సమర శంఖమూదారు. మంగళవారం గ్యాంగ్ డాంగ్ లోని మిలిటరీ బేస్ ను సందర్శించిన ఆయన.. యుధ్ధానికి సిద్ధంగా ఉండాల్సిదిగా పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీకి సూచించారు. అయితే అది ఇండియా మీదా కాదా అన్నది స్పష్టం కాలేదు. మన దేశానికి విధేయులుగా ఉండాలని, వార్ మీదే మీ శక్తిని, మనసును కేంద్రీకరించాలని అన్నారు. అయితే ఈ పిలుపు ఇండియాను ఉద్దేశించా లేక అమెరికా మీదా లేక సౌత్ చైనా సీ లో తనకు ప్రత్యర్థులుగా ఉన్న దేశాలమీదా అన్నది తెలియలేదు. హై అలెర్ట్ గా ఉండాలని, విశ్వసనీయులుగా ఉండాలని కూడా జీ జిన్ పింగ్ కోరారు. నిన్న భారత చైనా దేశాల మధ్య ఏడో దఫా కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. అయితే జీ గారి పిలుపుపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.

పోరాట పటిమను పెంచుకోవాలని, ఫీల్డ్ లో బహుళ సామర్థ్యంతో, ‘రాపిడ్ రెస్పాన్స్’ తో వ్యవహరించాలని, పార్టీకి, మిలిటరీకి ‘నిష్కల్మషమైన’ విధేయులుగా ఉండాలంటూ జీ జిన్ పింగ్ పేర్కొన్నట్టు సిన్ హువా వార్తా సంస్థ తెలిపింది.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 13 న లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్ లలో బ్రిడ్జీలను లాంచ్ చేశారు. దీనిపై చైనా ఇండియాను టార్గెట్ చేసింది. లడాఖ్ కేంద్రపాలితప్రాంతాన్ని, అరుణాచల్ ప్రదేశ్ ని తాము గుర్తించబోమని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. లడాఖ్ యూనియన్ టెరిటరీని భారత్ అక్రమంగా ‘ఏర్పాటు చేసింది’ పైగా సరిహద్దుల్లో తన సేనలను మోహరిస్తోంది అని దుయ్యబట్టింది. ఇండో-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగడానికి ఇండియాయే కారణమని కూడా విమర్శించింది.