అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 100 కోట్ల విరాళాలు అందాయని రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపక్ రాయ్ తెలిపారు. తమ కార్యాలయానికి ఇంతవరకు డేటా అందలేదని, కానీ తమ కార్యకర్తల నుంచి ఈ మేరకు రిపోర్టు అందిందని ఆయన చెప్పారు. ఈ మహత్తర కార్యక్రమానికి ఇంత మేర సొమ్ము అందిందని పేర్కొన్నారని చెప్పిన ఆయన.., వారు దేశంలోని అన్ని జిల్లాలను విరాళాల కోసం సందర్శిస్తున్నారని వెల్లడించారు. ఈ నెల 15 నుంచి తమ ట్రస్ట్ విరాళాలు సేకరించడం ప్రారంభించిందని, ఇది ఫిబ్రవరి 27 వరకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. దేశంలో ఎవరైనా, ఏ మతం వారైనా డొనేషన్లు ఇవ్వవచ్ఛునని చంపక్ రాయ్ పేర్కొన్నారు. సుమారు 39 నెలల్లో..బహుశా 2024 నాటికి రామాలయ నిర్మాణం పూర్తి కావచ్చు అన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ఆలయ నిర్మాణానికి రూ. 5 లక్షలకు పైగా డొనేషన్ అందజేశారు. తనను రాష్ట్రపతి భవన్ లో కలిసిన ట్రస్ట్ ప్రతినిధి బృందానికి ఆయన ఈ మేరకు చెక్కు అందించారు.
ఇలా ఉండగా రామాలయ మందిరానికి 25 కి.మీ. దూరంలో మసీదు నిర్మాణానికి ముస్లిం సంస్థలు సన్నాహాలు ప్రారంభించాయి. ఇందుకు డిజైన్ ని ఓ కమిటీ ఆమోదించింది.
Also Read: Indian Oil tatkal facility: తత్కాల్ సిలిండర్ సౌకర్యం.. బుక్ చేసిన గంటల్లో సిలిండర్ హోమ్ డెలివరీ