వైసీపీ ఫైర్ బ్రాండ్ బైరెడ్డి సిద్దార్థ్రెడ్డిపై కేసు నమోదు…
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా లాక్డౌన్ కొనసాగుతోంది. పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మహమ్మారి వైరస్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు అహర్నిశలు పనిచేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలని ప్రజలను పదే, పదే హెచ్చరిస్తున్నారు. మాట వినకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో పొలిటిషియన్స్ ని కూడా వదలడం లేదు పోలీసులు. […]
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా లాక్డౌన్ కొనసాగుతోంది. పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మహమ్మారి వైరస్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు అహర్నిశలు పనిచేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలని ప్రజలను పదే, పదే హెచ్చరిస్తున్నారు. మాట వినకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో పొలిటిషియన్స్ ని కూడా వదలడం లేదు పోలీసులు.
తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై.. నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఆదివారం హైపో ద్రావణం స్ప్రే చేసేందుకు వచ్చిన వారు లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించారని, భౌతిక దూరం పాటించకపోవడంతో..నేతలతో పాటు వారి అనుచరులుపైనా కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే.