బీహార్ ఎన్నికల్లో ప్రధాని మోదీ ..యూపీ, బీహార్ రాజకీయాలను పోల్చారు. మూడు, నాలుగేళ్ళ క్రితం యూపీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఇద్దరూ (డబుల్ యువరాజులు) చేతులు కలిపారని, కానీ వారిని ప్రజలు ఇంటికి సాగనంపి (ఎన్నికల్లో ఓడించి) బీజేపీకి విజయాన్ని ఇచ్చారని ఆయన అన్నారు. ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో రాహుల్, తేజస్వి యాదవ్ లకు కూడా అదేగతి పడుతుందన్నారు. తేజస్విని ఆయన ప్రిన్స్ ఆఫ్ జంగల్ రాజ్ గా అభివర్ణించారు. చాప్రా నియోజకవర్గంలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ ర్ రాష్ట్రంలో నితీష్ కుమార్ విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.