ఎడ్యూరప్పకు కోపమొచ్చింది.. స్టేజీపైనే…

| Edited By: Pardhasaradhi Peri

Jan 15, 2020 | 2:14 PM

కర్ణాటక సీఎం ఎడ్యూరప్పకు కోపమొచ్చింది. ఏకంగా ఓ వేదికపైనే ఆగ్రహంగా లేచి వెళ్లి.. లింగాయత్ కులానికి చెందిన ఓ స్వామీజీ మీద ఫైరయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. దావణగేరె లోని హరిహరలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన నిగ్రహాన్ని అణచుకోలేకపోయారు. బీజేపీలో తన ప్రత్యర్థి వర్గానికి చెందిన మురుగేష్ నీరానీ అనే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటూ  వేదికపైనే ఉన్న వచనానందస్వామి కోరడం ఆయన కోపానికి కారణమైంది. ‘ నీరానీని నిర్లక్ష్యం చేయరాదని, అతని గురించి […]

ఎడ్యూరప్పకు కోపమొచ్చింది.. స్టేజీపైనే...
Follow us on

కర్ణాటక సీఎం ఎడ్యూరప్పకు కోపమొచ్చింది. ఏకంగా ఓ వేదికపైనే ఆగ్రహంగా లేచి వెళ్లి.. లింగాయత్ కులానికి చెందిన ఓ స్వామీజీ మీద ఫైరయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. దావణగేరె లోని హరిహరలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన నిగ్రహాన్ని అణచుకోలేకపోయారు. బీజేపీలో తన ప్రత్యర్థి వర్గానికి చెందిన మురుగేష్ నీరానీ అనే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటూ  వేదికపైనే ఉన్న వచనానందస్వామి కోరడం ఆయన కోపానికి కారణమైంది. ‘ నీరానీని నిర్లక్ష్యం చేయరాదని, అతని గురించి పట్టించుకోకపోతే మా లింగాయత్ ల మద్దతును మీరు కోల్పోతారని ఆ స్వామీజీ హెచ్చరించారు.
దీంతో ఎర్రబడిన ముఖంతో వేదికపైనే విసవిసా నడిచి వఛ్చి.. ఎడ్డీ.. ఆయన కాళ్లకు నమస్కరిస్తూనే.. ఇదంతా వినడానికి తానిక్కడికి రాలేదని, మీ డిమాండ్ల ప్రకారం నడచుకోలేనని.. అంటూ.. ఇక వెళ్ళిపోతా ‘ అంటూ వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. అయితే రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్ బొమ్మై సహా ఇతర సహచరులంతా నచ్చజెప్పడంతో యెడ్యూరప్ప మళ్ళీ తన సీటువద్దకు వెళ్లి కూర్చున్నారు. ఆ తరువాత జరిగిన ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన ఎడ్డీ.. తనను ముఖ్యమంత్రిని చేయడానికి సాయపడి తమ పదవులకు రాజీనామా చేసిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేల విషయాన్ని తాను చూసుకోవాల్సి ఉందన్నారు.
దయచేసి వచనానందస్వామి వంటివారు తన పరిస్థితిని గమనించాలని,, ఆ రెబల్ ఎమ్మెల్యేలే తనకు సహాయ పడిఉండకపోతే తాను ముఖ్యమంత్రిని అయ్యే వాడినే కానని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పదవికి అంటిపెట్టుకుని ఉండాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు.. ‘ మీరు కోరితే రేపే రాజీనామా చేస్తా ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా-బిల్గి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మురుగేష్ నీరానీ అత్యంత శక్తిమంతమైన లింగాయత్ కులానికి చెందినవారు. వారు తలచుకుంటే కర్ణాటకలో బీజేపీ ఓట్లకే గండి కొట్టగలరు. ఈ నెలాఖరులో ఎడ్డీ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు.