కరోనా వైరస్ పరిస్థితి అదుపులో ఉంది, నైట్ కర్ఫ్యూ అవసరంలేదు, మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే, మాస్కులు తప్పనిసరి

| Edited By: Pardhasaradhi Peri

Dec 20, 2020 | 2:50 PM

రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితి అదుపులో ఉందని, రాత్రి కర్ఫ్యూ అవసరం లేదని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే అన్నారు. ఆదివారం మీడియాతో వర్చ్యువల్ గా మాట్లాడిన ఆయన..

కరోనా వైరస్ పరిస్థితి అదుపులో ఉంది, నైట్ కర్ఫ్యూ అవసరంలేదు, మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే, మాస్కులు తప్పనిసరి
Follow us on

రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితి అదుపులో ఉందని, రాత్రి కర్ఫ్యూ అవసరం లేదని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే అన్నారు. ఆదివారం మీడియాతో వర్చ్యువల్ గా మాట్లాడిన ఆయన.. ఏమైనా ప్రజలు మరో ఆరు నెలలపాటు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందే అన్నారు. అలాగే భౌతిక దూరాన్ని కూడా పాటించాలన్నారు. ఇలా చేయడంవల్ల కోవిడ్ ని దూరంగా ఉంచవచ్చు అని పేర్కొన్నారు. శీతాకాల సంబంధ వ్యాధుల ముప్పు పొంచి ఉందని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉధ్ధవ్ హెచ్ఛరించారు. పెళ్లిళ్లు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వంటి సమయాల్లో ప్రజలు గెస్టులను ఆహ్వానించాలి గానీ వైరస్ ను కాదు అని ఆయన చమత్కరించారు. కొంతమంది లాక్ డౌన్,  రాత్రి కర్ఫ్యూ విధించాలని సూచిస్తున్నారు. అయితే ఆ అవసరం లేదని భావిస్తున్నాం అని ఆయన పునరుద్ఘాటించారు.

ముంబై మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టుపై నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు బీజేపీ తమతో చర్చలకు రావాలని ఆయన కోరారు. కావాలంటే ఈ క్రెడిట్ మీరే తీసుకోండి అన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయని ఉధ్ధవ్ థాక్రే న్నారు. ఒక ప్రతిష్ట్మాత్మక ప్రాజెక్టు విషయంలో జాప్యం జరగడం మంచిది కాదని ఆయన చెప్పారు.