జులై 4.. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజు. సాధారణంగా ఇది అమెరికన్లకు పండుగ రోజే. ..ప్రతి ఏటా జులై 4 న దేశమంతా అత్యంత కోలాహలంగా ఉంటుంది. కాలిఫోర్నియా, మియామీ, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాలలో బీచ్ లు సందర్శకులతో కళకళలాడుతుంటాయి. వీధుల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కానీ ఈసారి పరిస్థితి ఇందుకు పూర్తిభిన్నం .. . కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడం, రేసిజానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ప్రదర్శనలు, ఘర్షణలు. పైగా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహంగా చేసిన ప్రసంగం ఈ సంబరాలను నీరు గార్చాయి. బీచ్ లను మూసివేయడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ వైరస్ కి గురి అయి వుండవచ్చునంటూ లాస్ ఏంజిలిస్ మేయర్ ఎరిక్ గార్ సెట్టి హెచ్చరించారు. ప్రజలు మరింత బెంబేలెత్తారు. దేశవ్యాప్తంగా పరేడ్ లను రద్దు చేశారు. చాలాచోట్ల హోటళ్లను మూసివేశారు. ఫ్లోరిడాలో తాజాగా 11,458 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.మియామీ బీచ్ లోకర్ఫ్యు విధించారు. వాషింగ్టన్ లో ట్రంప్ వైట్ హౌస్ పై నుంచి ప్రజలనుద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు.
కాగా-అమెరికా 244 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని మోదీ.. ట్రంప్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇందుకు ట్రంప్ స్పందిస్తూ..అమెరికా లవ్స్ ఇండియా అని తానూ ట్వీట్ చేశారు.
I congratulate @POTUS @realDonaldTrump and the people of the USA on the 244th Independence Day of the USA. As the world’s largest democracies, we cherish freedom and human enterprise that this day celebrates. @WhiteHouse
— Narendra Modi (@narendramodi) July 4, 2020