బిహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ సీఎం అభ్యర్థి, బీజేపీ ప్రకటన

| Edited By: Pardhasaradhi Peri

Aug 23, 2020 | 4:34 PM

బిహార్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమారే సీఎం అభ్యర్థి అని బీజేపీ అధ్యక్షుడు జేపీ.నడ్డా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జేడీ-యు, ఎల్ జేపీ..

బిహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ సీఎం అభ్యర్థి, బీజేపీ ప్రకటన
Follow us on

బిహార్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమారే సీఎం అభ్యర్థి అని బీజేపీ అధ్యక్షుడు జేపీ.నడ్డా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జేడీ-యు, ఎల్ జేపీ, బీజేపీ కలిసికట్టుగా పోటీ చేస్తాయని ఆయన చెప్పారు. అయితే నితీష్ నేతృత్వంలోని జేడీ-యుకి, చిరాగ్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని ఎల్ జేపీకి మధ్య మాటల యుద్డం సాగుతున్న నేపథ్యంలో నడ్డా ప్రకటన రాజకీయవర్గాలను అయోమయంలో పడేసింది. కానీ ఎన్నికల నాటికి ఉభయ పార్టీల మధ్య సయోధ్య కుదరవచ్ఛునని కూడా భావిస్తున్నారు. రాష్ట్రంలో కోవిడ్, వరదల పరిస్థితిని నితీష్ కుమార్ సమర్థంగా అదుపు చేయగలిగారని నడ్డా ప్రశంసించారు. అందువల్ల ఆయనే సీఎం అభ్యర్థి అని వ్యాఖ్యానించారు.

రానున్న అక్టోబర్-నవంబర్ నెలల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని బీజేపీ  తమకు ప్రతిష్ట్మాత్మకంగా భావిస్తోంది.