New Covid strain in India: కలవరపెడుతున్న కొత్త రకం వైరస్ స్ట్రెయిన్.. ఇప్పటి వరకు 96 మందికి పాజిటివ్..!

|

Jan 11, 2021 | 3:12 PM

ఇండియాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అందరూ ఊరటగా ఉన్న వేళ కరోనా స్ట్రెయిన్ కలకలం రేపుతోంది.

New Covid strain in India:  కలవరపెడుతున్న కొత్త రకం వైరస్ స్ట్రెయిన్.. ఇప్పటి వరకు 96 మందికి పాజిటివ్..!
Follow us on

New Covid strain in India:  ఇండియాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అందరూ ఊరటగా ఉన్న వేళ కరోనా స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. దేశంలో కోవిడ్ స్ట్రెయిన్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. సోమవారం నాటికి దేశంలో 96 కొత్త రకం కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. స్ట్రెయిన్ సోకినవారి పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వారిని సింగిల్ రూమ్ ఐసోలేషన్‌లో ఉంచాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ వైరస్ సోకినవారితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

యూకేకు చెందిన కొత్త రకం కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. డెన్మార్క్, నెథర్లాండ్స్​, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్,  దేశాల్లో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి అధికంగా ఉంది. స్ట్రెయిన్ వైరస్ కట్టడిని అడ్డుకునేందుకు కేంద్రం భారత్‌-యూకే మధ్య విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.  ఇటీవల ఆ బ్యాన్ ఎత్తివేశారు. జనవరి 6న భారత్‌ నుంచి యూకేకు తిరిగి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. జనవరి 8 నుంచి యూకే-భారత్‌ సేవలు కూడా పునరుద్ధరించారు. అయితే బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయనున్నారు. అంతేగాక, విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు నిబంధన విధించారు.

Also Read :  విద్యార్థులకు సీఎం జగన్ బంపరాఫర్.. ‘అమ్మఒడి’ డబ్బులు వద్దనుకుంటే ల్యాప్‌టాప్‌లు