ఒడిశా జిల్లా కలెక్టర్ పై మర్డర్ కేసు, అసలేం జరిగింది ? అంతా మిస్టరీ ! అవినీతిని ప్రశ్నించినందుకే హత్య చేశారా ?

| Edited By: Anil kumar poka

Nov 16, 2020 | 12:14 PM

ఒడిశా లోని మల్కాన్ గిరి జిల్లా కలెక్టర్ మనీష్ అగర్వాల్ పైన, ఆయన కార్యాలయంలో పని చేసే మరో ముగ్గురిపైనా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

ఒడిశా జిల్లా కలెక్టర్ పై మర్డర్ కేసు, అసలేం జరిగింది ? అంతా మిస్టరీ ! అవినీతిని ప్రశ్నించినందుకే హత్య చేశారా ?
Follow us on

ఒడిశా లోని మల్కాన్ గిరి జిల్లా కలెక్టర్ మనీష్ అగర్వాల్ పైన, ఆయన కార్యాలయంలో పని చేసే మరో ముగ్గురిపైనా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మనీష్ అగర్వాల్ పర్సనల్ అసిస్టెంట్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడని, దీంతో జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలతో మర్డర్ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అలాగే కోర్టు ఉత్తర్వులపై ‘సిట్’ ను కూడా ఏర్పాటు చేశామన్నారు. మనీష్ పీఏ దేబనారాయణ పాండే లోగడ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. మనీష్ తో బాటు మరో ముగ్గురి అవినీతి గురించి తన భర్తకు తెలుసునని, అందువల్ల వారే ఆయనను హత్య చేసి ఉంటారని పాండే భార్య కోర్టుకు తెలిపింది. వీరిపై హత్య కేసు నమోదు చేయాలని  పోలీసులను ఆదేశించవలసిందిగా ఆమె అభ్యర్థించింది. దర్యాప్తు ప్రక్రియను అడ్డుకునేందుకు కలెక్టర్ కార్యాలయంలోని సీసీ టీవీ ఫుటేజీని కూడా మాయం చేశారని ఆమె ఆరోపించింది.

దేబనారాయణ పాండే గత ఏడాది డిసెంబరు 27 న తన కార్యాలయానికి వెళ్లి మళ్ళీ కనిపించలేదు. ఆ మరుసటిరోజున మల్కాన్ గిరిలోని సతిగూడ డ్యామ్ లో ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. ఇది కచ్చితంగా హత్యేనని కాంగ్రెస్ పార్టీ కూడా అప్పట్లో పెద్దఎత్తున ఆందోళనకు దిగింది.