స్కూలు టీచర్ ని హత్య చేసిన నిందితుడ్ని కొట్టి చంపారు

| Edited By: Pardhasaradhi Peri

Sep 07, 2020 | 2:20 PM

యూపీలో దారుణం జరిగింది. ఓ స్కూలు టీచర్ ను గన్ తో కాల్చి చంపిన నిందితుడిని స్థానికులు కొట్టి చంపారు. పోలీసుల సమక్షంలోనే వారు అతనిపై కర్రలతో దాడి చేశారు. గుంపు నుంచి తప్పించుకోవడానికి..

స్కూలు టీచర్ ని హత్య చేసిన నిందితుడ్ని కొట్టి చంపారు
Follow us on

యూపీలో దారుణం జరిగింది. ఓ స్కూలు టీచర్ ను గన్ తో కాల్చి చంపిన నిందితుడిని స్థానికులు కొట్టి చంపారు. పోలీసుల సమక్షంలోనే వారు అతనిపై కర్రలతో దాడి చేశారు. గుంపు నుంచి తప్పించుకోవడానికి అతడు ఇంటిపైకి ఎక్కినా స్థానికులు వదల లేదని, కిందికి లాక్కుని వచ్చి ఎటాక్ చేశారని తెలిసింది. తమ కళ్ళ ముందే వారు అతడిని కొడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. కసి తీరని గుంపు నిందితుడి తలను నేలకేసి కొట్టడంతో అక్కడంతా భీతావహ పరిస్థితి ఏర్పడింది. తూర్పు యూపీ లోని కుషాయి నగర్ లో జరిగింది ఈ ఘటన. ఈ మర్దరర్ తన తండ్రికి చెందిన గన్ తీసుకువఛ్చి స్కూలు టీచర్ ను కాల్చి చంపాడని, అతడు గోరఖ్ పూర్ వాసి అని తెలిసింది. ఈ  సంఘటనకు  సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.