వంద‌ల సంఖ్య‌లో ఏనుగుల మరణం.. తెలియ‌ని కారణం

| Edited By: Pardhasaradhi Peri

Jul 03, 2020 | 12:45 PM

ఆఫ్రికా దేశం అయిన బోత్సువానాలో ఏనుగుల‌ అనుమానాస్పద మ‌ర‌ణాలు క‌ల‌క‌లం రేపాయి. దాదాపు 360పైగా ఏనుగులు అంతుచిక్క‌ని కార‌ణంతో త‌నువు చాలించాయి.

వంద‌ల సంఖ్య‌లో ఏనుగుల మరణం.. తెలియ‌ని కారణం
Follow us on

ఆఫ్రికా దేశం అయిన బోత్సువానాలో ఏనుగుల‌ అనుమానాస్పద మ‌ర‌ణాలు క‌ల‌క‌లం రేపాయి. దాదాపు 360పైగా ఏనుగులు అంతుచిక్క‌ని కార‌ణంతో త‌నువు చాలించాయి. కాగా ఏనుగులు సామూహిక మ‌ర‌ణాల‌కి కార‌ణాలు ఏంట‌న్న‌ది కనుక్కోవడానికి వన్యప్రాణి నిపుణులు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యాన్ని బోత్సువానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ నేషనల్ పార్క్ సీరియ‌స్ గా తీసుకుంది. అధికారులు ఏనుగుల మృతదేహాలకు పరీక్షలు నిర్వహించారు. అయితే కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆ న‌మూనాల‌ను ప్రపంచంలోని పలు దేశాల్లోని అత్యుత్తమ ల్యాబుల‌కు త‌ర‌లించ‌డానికి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. అయితే లాక్ డౌన్ మిన‌హాయింపులు ఉన్న‌ కొన్ని దేశాల‌కు శాంపిల్స్ పంపించారు. రిపోర్ట్స్ రావడానికి మరో రెండు వారాల సమయం పడుతుంద‌ని స‌మాచారం.

ఆఫ్రికాలో మొత్తం ఏనుగులు అన్నింటిలో.. అధిక‌ భాగం బోత్సువానాలోనే ఉన్నాయి. ఏనుగుల దంతాల కూడా మిస్ అవ్వ‌లేదు కాబ‌ట్టి వాటిని వేట‌గాళ్లు చంపలేద‌ని ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు అధికారులు. విషప్రయోగం జరిగిందా అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.