కరోనా వైరస్ వ్యాక్సీన్ పంపిణీపై ఉదారత, మోదీ కి ఆదార్ ప్రశంస

| Edited By: Pardhasaradhi Peri

Sep 27, 2020 | 3:07 PM

ఇండియా ఉత్పత్తి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సీన్ ని ఇతర దేశాలకు పంపిణీ చేయడానికి ప్రధాని మోదీ చేస్తున్న ఏర్పాట్ల పట్ల సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. భారతీయులకే కాక ఇతర  ప్రపంచ దేశాల..

కరోనా వైరస్ వ్యాక్సీన్ పంపిణీపై ఉదారత, మోదీ కి  ఆదార్ ప్రశంస
Follow us on

ఇండియా ఉత్పత్తి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సీన్ ని ఇతర దేశాలకు పంపిణీ చేయడానికి ప్రధాని మోదీ చేస్తున్న ఏర్పాట్ల పట్ల సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. భారతీయులకే కాక ఇతర  ప్రపంచ దేశాలవారికి కూడా అందజేస్తామంటూ ఐరాస సర్వ ప్రతినిధి సభకు ఆయన హామీ ఇవ్వడం ఇండియాకు ఎంతో గర్వ కారణమన్నారు. మోదీ పర్యవేక్షణలో మన దేశీయులకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన ట్వీట్ చేశారు. మోదీ నాయకత్వానికి ధన్యవాదాలన్నారు. కాగా-తాము ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ ని . కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి, ప్రతి భారతీయుడికి అందజేయడానికి కేంద్రం వద్ద మరో ఏడాది కాలానికి గాను,  రూ. 80 వేల కోట్లు ఉన్నాయా అని ఆదార్ ట్వీట్ చేసిన సంగతి విదితమే.

ప్రపంచంలోనే కరోనా వైరస్ వ్యాక్సీన్ల తయారీలో ఇండియా అగ్ర స్థానంలో ఉందని ఈ వైరస్ కారణంగా తల్లడిల్లుతున్న పలు దేశాలకు దీన్ని అందజేయడానికి తాము కృషి చేస్తున్నామని మోదీ..ఐరాస సభనుద్దేశించి చేసిన తన వర్చ్యువల్ ప్రసంగంలో హామీ ఇచ్చారు.