తీరు మారని పాకిస్తాన్.. ప్రధాని మోదీ నిర్ణయంతో షాక్

| Edited By: Anil kumar poka

Oct 23, 2019 | 4:11 PM

జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేస్తూ.. అదే సమయంలో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్‌ని కుదిపివేసింది. అసలు ఈ నిర్ణయాల్లో ఏది కూడా ద్వైపాక్షిక ఒప్పందాల ఉల్లంఘన కానే కాదు. ఇది పూర్తిగా మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి లోబడి తీసుకున్న నిర్ణయం. అయితే 70 ఏళ్ళ భారత అంతర్గత కాశ్మీర్ వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలన్న ప్రతిపాదనను పాక్ […]

తీరు మారని పాకిస్తాన్.. ప్రధాని మోదీ నిర్ణయంతో షాక్
Follow us on

జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేస్తూ.. అదే సమయంలో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్‌ని కుదిపివేసింది. అసలు ఈ నిర్ణయాల్లో ఏది కూడా ద్వైపాక్షిక ఒప్పందాల ఉల్లంఘన కానే కాదు. ఇది పూర్తిగా మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి లోబడి తీసుకున్న నిర్ణయం.

అయితే 70 ఏళ్ళ భారత అంతర్గత కాశ్మీర్ వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలన్న ప్రతిపాదనను పాక్ సహించలేకపోతోంది. పైగా తన దేశ అభివృధ్ది పట్ల సొంత ప్రజల దృష్టిని మళ్లించడమే తన పాలసీగా పెట్టుకుంది. ఇస్లామిక్ దేశాల నుంచే గాక.. యుఎస్ నుంచి కూడా తమ మనుగడ కోసం.. నిధులకోసం కాశ్మీర్ సమస్యను ఆ దేశం వినియోగించుకోజూస్తోంది. ఇది దశాబ్దాల తరబడి సాగుతోంది.

ఫ్రీడం స్ట్రగుల్ అన్న నిరాధారమైన నినాదం పేరిట పాకిస్తాన్ స్థానిక యువతను ఉగ్రవాదులుగా మార్చేందుకు శిక్షణనిస్తున్న విషయం జగమెరిగిన సత్యం. సరిహద్దుల్లో తమ ఉగ్రవాదులు చొరబడేలా ఆ దేశం చేయని ప్రయత్నమంటూ లేదు. అలాగే భారత జవాన్లపై దాడులు చేయడానికి, కాశ్మీర్లో అశాంతిని రెచ్చగొట్టడానికి పాక్ చేస్తున్న కుతంత్రాలు అందరికి తెలిసిందే. 72 ఏళ్లుగా భారత దేశాన్ని అస్థిరపరచేందుకు పాక్ శతవిధాలా యత్నిస్తోంది. జమ్మూ కాశ్మీర్ విషయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశం షాక్ తిన్నది.

ఇండియాతో యుధ్ధాన్ని కోరుతున్నా .. ఏ యుధ్ధంలోనూ గెలవలేకపోయింది. కునారిల్లుతున్న తన దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టుకోలేక యుధ్ధం బూచిని చూపుతున్న పాక్.. ఇండియాను ఎంతగా కవ్వించాలని అనుకుంటున్నా .. దాని యత్నాలు నిష్ఫలమవుతున్నాయి. భారత్ శాంతి దేశం అన్న విషయం ఆ దేశానికీ తెలుసు. 1947 లో స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ సదా శాంతి కాముక దేశం ఇండియా.

ఏ దేశంతోనూ యుధ్ధానికి తలపడలేదు. ఏదేశాన్నీ రెచ్ఛగొట్టలేదు. భారత దేశాన్ని ఒక్క పాక్ తప్ప అన్ని దేశాలూ గౌరవిస్తున్నాయి. అలాగే భారత సైన్యం విశిష్టత కూడా ప్రపంచ దేశాలకు తెలుసు. కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ ఎన్నిసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందో ఒక్కసారి చరిత్ర రికార్డులు చూస్తే అర్థమవుతుంది.

ఇండియాకున్న సైనిక శక్తి అపారం. అత్యంత ఆధునాతన యుధ్ధ వ్యూహాల్లో మన సాయుధ దళాల సత్తా అనిర్వచనీయం. ఎప్పుడైనా యుధ్ధానికి సిధ్ధంగా ఉండడం దీని ప్రత్యేకత. కానీ పాక్ విషయం అలా కాదు. సామాజికంగా, ఆర్థికంగా విఫలమైన ఆ దేశం ఏ రకంగా చూసినా మన సైనిక పాటవానికి సరితూగలేదు. బలహీనమైన కమాండ్ కంట్రోల్ ఆ దేశానిది. తన రాజకీయ మనుగడ కోసం పాకిస్థాన్ ఇండియాతో కయ్యానికి కాలు దువ్వాలన్నా.. ఈ ‘ వీక్ ‘ కమాండ్ దృష్ట్యా వెనుకంజ వేస్తోంది. అయినా ఒకవేళ ఆ ప్రయత్నమే చేస్తే చావుదెబ్బ తినడం ఖాయం.

Disclaimer: రచయిత బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి.. ఆర్టికల్ లో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం. పార్టీ అభిమతం. వాటితో టీవీ 9 వెబ్ సైట్ కి ఎలాంటి సంబంధం లేదు. వాటిని టీవీ 9 వెబ్ సైట్ ఉద్దేశాలుగా భావించవద్దని మనవి.