‘సీతారాములు రావణుడిని ఓడించినట్టుగా’, బ్రిటన్ పీఎం నోట రామాయణ గాథ !

| Edited By: Pardhasaradhi Peri

Nov 07, 2020 | 3:29 PM

రాక్షస రాజైన రావణుడిని ఓడించి సీతారాములు తిరిగి వచ్చినట్టుగా మీరు కూడా ఈ కరోనా వైరస్ ని జయించి లక్షలాది దీపాలు వెలిగించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో మనమంతా సఫలీకృతులమవుదాం అన్నారు. ఈ దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయమని వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్ లో గురువారం నుంచి వచ్ఛే డిసెంబరు 2 వరకు నెలరోజులపాటు సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఆయన.. మనముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, […]

సీతారాములు రావణుడిని ఓడించినట్టుగా, బ్రిటన్ పీఎం నోట రామాయణ గాథ !
Follow us on

రాక్షస రాజైన రావణుడిని ఓడించి సీతారాములు తిరిగి వచ్చినట్టుగా మీరు కూడా ఈ కరోనా వైరస్ ని జయించి లక్షలాది దీపాలు వెలిగించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో మనమంతా సఫలీకృతులమవుదాం అన్నారు. ఈ దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయమని వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్ లో గురువారం నుంచి వచ్ఛే డిసెంబరు 2 వరకు నెలరోజులపాటు సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఆయన.. మనముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, చీకటిపై వెలుగుదే గెలుపని దీపావళి చెబుతోందని పేర్కొన్నారు. అలాగే ఈ కరోనా పాండమిక్ పై మనం విజయం సాధిద్దాం అన్నారు. బ్రిటన్ లోని ప్రవాస భారతీయులను బోరిస్ జాన్సన్ ఎంతగానో ప్రశంసించారు. ఇళ్లలోనే ఉండి ..స్టే సేఫ్ అన్నట్టుగా వీరు తమ ఇళ్లల్లో ‘ఫాంటాస్టిక్ వర్చ్యువల్’ దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో ఆనందకరమన్నారు. ఈ సందర్భంగా ఆయన సమోసా, గులాబీ జామున్ వంటి భారతీయ డిషెస్ గురించి కూడా ప్రస్తావించారు. హిందువులు, సిక్కులు, ఇలా ఇండియాకు చెందిన అనేక వర్గాలు దీపావళిని ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారని ఆయన చెప్పారు.