మళ్ళీ పబ్లిక్ లోకి కిమ్ జోంగ్ ఉన్….వార్ మెమోరియల్ వద్ద నివాళి

| Edited By: Pardhasaradhi Peri

Jul 28, 2020 | 2:46 PM

నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మళ్ళీ ప్రజల్లో  దర్శనమిచ్చాడు.   1950-53 మధ్య జరిగిన యుధ్ధంలో ప్రాణాలర్పించిన తమ దేశ సైనికులకు శ్రధ్ధాంజలి ఘటించాడు. ప్యాంగ్ యాంగ్ సరిహద్దులోని సైనిక స్మారక ప్రదేశం వద్దకు వెళ్లి..

మళ్ళీ పబ్లిక్ లోకి కిమ్ జోంగ్ ఉన్....వార్ మెమోరియల్ వద్ద నివాళి
Follow us on

నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మళ్ళీ ప్రజల్లో  దర్శనమిచ్చాడు.   1950-53 మధ్య జరిగిన యుధ్ధంలో ప్రాణాలర్పించిన తమ దేశ సైనికులకు శ్రధ్ధాంజలి ఘటించాడు. ప్యాంగ్ యాంగ్ సరిహద్దులోని సైనిక స్మారక ప్రదేశం వద్దకు వెళ్లి.. అక్కడి సైనిక సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచాడు. కొరియా దేశాల మధ్య యుధ్ధం జరిగి 67 ఏళ్ళు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని తమ దేశ సీనియర్ సైనికాధికారులకు  ‘స్మారక పిస్టళ్లను’ కిమ్ అందజేశాడు. అలాగే సౌత్ కొరియా సరిహద్దులోని ‘కేసాంగ్’ సిటీలో ఆయన లాక్ డౌన్ ప్రకటించాడు. ఈ నగరంలో ఓ కరోనా వైరస్ కేసు బయటపడింది. ఈ నగరం నుంచి మూడేళ్ళ క్రితం ఓ వ్యక్తి సౌత్ కొరియాకి వెళ్లాడని, వారం రోజుల క్రితమే తిరిగి ఇక్కడికి వచ్చిన అతనికి కరోనా ఇన్ఫెక్షన్ సోకిందని తెలిసింది.

తమ దేశంలో కోవిడ్ కేసుల గురించి ఉత్తర కొరియా ప్రకటించనప్పటికీ.. ఈ వైరస్ వ్యాప్తికి సౌత్ కొరియాయే కారణమని ఆరోపిస్తోంది. కాగా ఈ విషమ వైరస్ మన దేశంలోకి ప్రవేశించిందని, దీన్ని ఎదుర్కోవడంలో తనకు దేశ ప్రజలు సహకరించాలని కిమ్ పిలుపునిచ్చా.డు