కేరళ స్థానిక ఎన్నికల్లో కొచ్చి కార్పొరేషన్ వార్డు బీజేపీ కైవసం, ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి

| Edited By: Anil kumar poka

Dec 16, 2020 | 1:38 PM

కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. కొచ్చి కార్పొరేషన్ నార్త్ ఐలాండ్ లో బీజేపీ అభ్యర్థి..కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.వేణుగోపాల్ ను ఓడించారు. కేవలం ఒక్క ఓటుతేడాతో వేణుగోపాల్ ఓడిపోయారు.

కేరళ స్థానిక ఎన్నికల్లో కొచ్చి కార్పొరేషన్ వార్డు బీజేపీ కైవసం, ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి
Follow us on

కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. కొచ్చి కార్పొరేషన్ నార్త్ ఐలాండ్ లో బీజేపీ అభ్యర్థి..కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.వేణుగోపాల్ ను ఓడించారు. కేవలం ఒక్క ఓటుతేడాతో వేణుగోపాల్ ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకున్న ఈయన ఓటమి ఈ పార్టీకి దెబ్బే ! ఈ కార్పొరేషన్  గత పదేళ్లుగా యూడీఎఫ్ చేతిలో ఉంటూ వచ్చింది. పాలక్కాడ్ లో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే లీడింగ్ లో ఉంది. 945 గ్రామ పంచాయతీలకు, 152 బ్లాకు పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 86 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు గత గురువారం ఎన్నికలు జరిగాయి. చాలా చోట్ల లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్, నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ మధ్య ముక్కోణ పోటీ తీవ్రంగా ఉంది. 945 గ్రామ పంచాయతీలకు గాను 402 పంచాయతీలలో పాలక ఎల్ డీ ఎఫ్ లీడింగ్ లో ఉండగా విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీ ఎఫ్ 343 పంచాయతీల్లో ఆధిక్యంలో ఉంది.

తిరువనంతపురం కార్పొరేషన్ లోని 100 వార్డుల్లో ఎల్ డీ ఎఫ్ 20, ఎన్డీయే 13, యూడీఎఫ్ 4 వార్డుల్లో లీడింగ్ లో ఉన్నాయి. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.