కర్నాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మైకి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. అయితే తాను ఏసిం ప్టోమాటిక్ అని, సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్తున్నానని ఆయన చెప్పారు. ఆరోగ్యంగా ఉన్నా.. అయినా నాతో కొన్ని రోజులుగా కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నా అని ఆయన చెప్పారు. ఇలా ఉండగా… ఇండియాలో కరోనా వైరస్ కేసులు బుధవారం నాటికీ 50 లక్షలకు చేరుకున్నాయి. ఒక్క రోజులో 90,123 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1290 మంది కరోనా రోగులు మృతి చెందారు. దీంతో మరణించినవారి సంఖ్య మొత్తం 82,066 కి చేరింది.