కనికరం లేని కసాయి రూ.20 కోసం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పసిపిల్లా అని చూడకుండా బావిలోకి తోసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుకుంది.బెళగావి జిల్లా జాగనూర గ్రామానికి చెందిన 4 ఏండ్ల దివ్య తినుబండారాలు కొనుక్కునేందుకు కిరణషాపుకి వెళ్లింది. అదే ప్రాంతానికి చెందిన పూజ అనే యువతి దివ్య చేతిలోని రూ.20 లాక్కునేందుకు ప్రయత్నించింది. దీంతో చిన్నారి గట్టిగా ఏడవడంతో స్థానికులు వస్తారని భావించిన ఆ కసాయి చిన్నారిని అక్కడే ఉన్న బావిలోకి తోసేసింది. ఇది గమనించిన స్థానికులు దివ్యను కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అప్పటికే చిన్నారి ప్రాణాలు అనంతలోకాల్లో కలిసిపోయాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.