TCongress: నేడు కాంగ్రెస్ లోకి కడియం, ఎఐసీసీ పెద్దల సమక్షంలో చేరిక

|

Mar 31, 2024 | 10:04 AM

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, సీనియర్ నేత కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆయన తన కుమార్తె కడియం కావ్యాతో కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఏఐసీసీ పెద్దల సమక్షంలో కడియం శ్రీహరి, కడియం కావ్యా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, సీనియర్ నేత కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆయన తన కుమార్తె కడియం కావ్యాతో కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఏఐసీసీ పెద్దల సమక్షంలో కడియం శ్రీహరి, కడియం కావ్యా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అయితే కడియం శ్రీహరి ఎంట్రీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు. కాగా కొన్ని చోట్ల కడియం శ్రీహరి చేరికను అడ్డుకొని దళిత నాయకులు నిరసన తెలుపుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. మొత్తం 17 స్థానాల్లో 14 స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానాల సంఖ్య పెంచుకోవడంలో భాగంగా ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఊపుతో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ

 

Follow us on