ఆ పదవి కోసం.. తన బయోడేటాను పంపిన జగ్గారెడ్డి..

| Edited By:

Nov 15, 2019 | 3:29 AM

కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ టీపీసీసీ పదవికోసం ఫైట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క మాత్రమే ఈ పదవి కోసం పోటీలో ఉన్నారనుకుంటే.. తాజాగా వీరికి పోటీగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఎంటర్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో జరిగిన చిట్‌చాట్‌లో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తన బయోడేటా కూడా పంపించినట్లు జగ్గారెడ్డి […]

ఆ పదవి కోసం.. తన బయోడేటాను పంపిన జగ్గారెడ్డి..
Follow us on

కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ టీపీసీసీ పదవికోసం ఫైట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క మాత్రమే ఈ పదవి కోసం పోటీలో ఉన్నారనుకుంటే.. తాజాగా వీరికి పోటీగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఎంటర్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో జరిగిన చిట్‌చాట్‌లో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తన బయోడేటా కూడా పంపించినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వైదొలిగిన తర్వాత..  ఆ పదవిని తనకు ఇవ్వాలని ఏఐసీసీకి విన్నవించుకున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 16వ తేదీ శనివారం ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం ఉందని.. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలకు తన బయోడేటాను పంపినట్లు తెలిపారు. ఆ బయోడేటాలో జగ్గారెడ్డి తన పూర్తి వివరాలను వెల్లడించారని తెలుస్తోంది. తన కుటుంబ వివరాలతో పాటుగా.. ఆయనపై ఉన్న కేసుల విషయం కూడా ఆ బయోడేటాలో పొందుపరిచారు. 14 రోజులు జైలు జీవితం గడిపిన విషయాన్ని కూడా అందులో పేర్కొన్నారు. ఈ బయోడేటా కాపీలను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురికి పంపించినట్లు తెలిపారు.

త్వరలోనే పార్టీ అధినేతలను కలిసి.. టీపీసీసీ పదవి గురించి చర్చిస్తానని.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. అందుకోసం తనవద్ద అద్భుతమైన మెడిసిన్ ఉందంటూ చెప్పుకొచ్చారు. సమయం వచ్చినప్పుడు దాన్ని బయటకు తీసి ఉపయోగిస్తానని వ్యాఖ్యనించారు. కాగా, టీ పీసీసీ చీఫ్ పదవికోసం.. పార్టీలో టఫ్ ఫైట్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత టీ పీసీసీ పదవి మార్చాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. దీంతో అటు అధిష్టానం కూడా టీపీసీసీ పదవి విషయంలో ఉత్తమ్‌కు ఉద్వాసన పలికి.. కొత్త వారిని నియమించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.