Greater Elections Results 2020:ఈసీ సర్య్కులర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు

|

Dec 04, 2020 | 10:53 AM

ఈసీ సర్క్యులర్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. స్వస్తిక్‌ సహా ఇతర గుర్తును ఓటుగా లెక్కించాలని ఈసీ సర్క్యులర్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. స్వస్తిక్‌ గుర్తు ఉంటేనే ఓటుగా పరిగణింపబడుతుందని చెప్పింది. జీహెచ్ఎంసీ కౌంటింగ్‌లో..

Greater Elections Results 2020:ఈసీ సర్య్కులర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు
Follow us on

ఈసీ సర్క్యులర్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. స్వస్తిక్‌ సహా ఇతర గుర్తును ఓటుగా లెక్కించాలని ఈసీ సర్క్యులర్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. స్వస్తిక్‌ గుర్తు ఉంటేనే ఓటుగా పరిగణింపబడుతుందని చెప్పింది. జీహెచ్ఎంసీ కౌంటింగ్‌లో స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలన్న ఎన్నికల సంఘం ఉత్తర్వులపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి జారీ చేసిన ఈసీ సర్క్యులర్‌పై హైకోర్టులో బీజేపీ పిటిషన్‌ వేసింది. ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ నేతలు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈసీ సర్క్యులర్‌ను తప్పుబట్టిన హైకోర్టు.. ఎన్నికలు రాజ్యాంగానికి లోబడే జరగాలని సూచించింది. స్వస్తిక్‌ గుర్తులున్న వాటినే లెక్కించాలని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే కౌంటింగ్‌ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలకు కౌంటర్‌ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు సూచనలతో కౌంటింగ్‌ ప్రక్రియ మారిపోయింది.