ప్రభాస్ షాకింగ్ న్యూస్ లు

|

Aug 31, 2020 | 8:55 PM

ఇంతకాలం భారీ ప్రాజక్టులు బాహుబలి 1.. 2, సాహో సినిమాలకు ఏళ్ల సమయం కేటాయించిన డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు రూటు మార్చాడు. చకచకా సినిమాలు చేసెయ్యాలన్న ఆలోచనతో..

ప్రభాస్ షాకింగ్ న్యూస్ లు
Follow us on

ఇంతకాలం భారీ ప్రాజక్టులు బాహుబలి 1.. 2, సాహో సినిమాలకు ఏళ్ల సమయం కేటాయించిన డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు రూటు మార్చాడు. చకచకా సినిమాలు చేసెయ్యాలన్న ఆలోచనతో అనౌన్స్ మెంట్లు ఇస్తున్నాడు. ప్రస్తుతం `రాధేశ్యామ్` చేస్తున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌కు ఓకే చెప్పాడు. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే ఇటీవల మరో భారీ సినిమాను ప్రకటించాడు.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించనున్న భారీ బడ్జెట్ సినిమా `ఆది పురుష్`లో నటించబోతున్నట్టు గ్రాండ్ ప్రకటన వచ్చింది. ఇలాఉంటే, ఇప్పుడు ప్రభాస్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ లో వినిపిస్తోంది. తమిళ అగ్ర దర్శకుడితో దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయబోతున్నాడన్నది లేటెస్ట్ ఫిల్మ్ అప్ డేట్. అదీ ప్రభాస్ జోరు.