farmers protest….ఢిల్లీకి మళ్ళీ పోటెత్తనున్న అన్నదాతలు, ఈ నెల 26 న బ్లాక్ డేగా పాటించే యోచన, సింఘు బోర్డర్లో తిరిగి ఆందోళనల పర్వం ?

| Edited By: Anil kumar poka

May 23, 2021 | 4:54 PM

వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుతో అన్నదాతలు మళ్ళీ ఢిల్లీ బాట పట్టనున్నారు. హర్యానాలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ దాన్ని ఖాతరు చేయకుండా వేలాది రైతులు ఆదివారం కర్నాల్ జిల్లా నుంచి ఢిల్లీకి బయల్దేరారు...

farmers protest....ఢిల్లీకి మళ్ళీ పోటెత్తనున్న అన్నదాతలు, ఈ నెల 26 న బ్లాక్ డేగా పాటించే యోచన, సింఘు బోర్డర్లో  తిరిగి ఆందోళనల పర్వం ?
Follow us on

వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుతో అన్నదాతలు మళ్ళీ ఢిల్లీ బాట పట్టనున్నారు. హర్యానాలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ దాన్ని ఖాతరు చేయకుండా వేలాది రైతులు ఆదివారం కర్నాల్ జిల్లా నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఈ నెల 26 న బ్లాక్ డేగా పాటించే యోచన ఉందని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. ఆ రోజుతో తమ ఆందోళన ప్రారంభించి ఆరు నెలలవుతుందని, భారత్ కిసాన్ యూనియన్ నేత గుర్నామ్ సింగ్ చారుని తెలిపారు. ఈ రోజున బస్తాడా టోల్ ప్లాజా నుంచి వందలాది ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో రైతులు ఢిల్లీ సరిహహద్దుల్లోని సింఘు బోర్డర్ కి కదిలారని ఆయన చెప్పారు. ఇంకా వివిధ జిల్లాలనుంచి కూడా అన్నదాతలు వీరితో కలుస్తారని ఆయన చెప్పారు. పంజాబ్ లోని సంగ్రూర్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ సమీపంలోని తిక్రి బోర్డర్ చేరుకుంటారన్నారు. తమ డిమాండ్లపై చర్చలు తిరిగి ప్రారంభించాలని తాము కోరుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని ఆయన ఆరోపించారు. కోవిద్ వ్యాప్తికి రైతులే కారణమని కేంద్రం ఆరోపిస్తోందని, అయితే జన సమూహాలు ఎక్కువగా ఉన్న చోటే ప్రభుత్వం ఎందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోందని చారుని ప్రశ్నించారు.

మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాసిందని ఆయన చెప్పారు.కాగా ఢిల్ఝికి బయల్దేరిన వేలాది రైతుల్లో చాలామంది అసలు మాస్కులే ధరించకపోగా.. కొందరు సరైన రీతిలో ధరించకుండా కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మార్చ్ లో పాల్గొన్నారు. ఇప్పుడిప్పుడే ఢిల్లీలో కోవిద్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఈ రైతుల మార్చ్ మళ్ళీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని భయపడుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ : sonu sood video : పాన్ ఇండియా మూవీ హీరోగా సోను భాయ్..క్రిష్ దర్శకత్వంలో రియల్ హీరో టూ రీల్ హీరో

వావ్ కాంబినేషన్ సాయి పల్లవి సరసన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న వీడియో ..:David Warner dance video.