GERMANY.. రెండు బార్లలో దుండగుల కాల్పులు.. 8 మంది మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు

| Edited By: Anil kumar poka

Feb 20, 2020 | 11:38 AM

జర్మనీలో కొందరు దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 8 మంది మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్రాంక్ ఫర్ట్ సమీపంలోని హనావూ సిటీలోని రెండు వేర్వేరు బార్లలో బుధవారం రాత్రి జరిగిందీ ఘటన.

GERMANY.. రెండు బార్లలో దుండగుల కాల్పులు.. 8 మంది మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు
Follow us on

జర్మనీలో కొందరు దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 8 మంది మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్రాంక్ ఫర్ట్ సమీపంలోని హనావూ సిటీలోని రెండు వేర్వేరు బార్లలో బుధవారం రాత్రి జరిగిందీ ఘటన.. కాల్పులు జరిపిన అనంతరం.. వారు తాము వఛ్చిన వాహనంలోనే పారిపోయారని పోలీసులు తెలిపారు. మొదట ఒక బార్ లోకి ప్రవేశించిన వీరు.. అక్కడ చేరినవారిపై ఫైరింగ్ జరిపారని, పోలీసులు వచ్ఛే లోగా మరో బార్ లో ఎంటరయి అక్కడ కూడా కాల్పులు జరిపారని తెలిసింది. దుండగుల బీభత్సానికి  ఈ బార్ల బయట కూడా నెత్తుటి మరకలు కనిపించాయి. వీరి కిరాతకానికి కారణం ఏమిటో తెలియలేదంటున్న పోలీసులు.. పరారీలో ఉన్న వీరి కోసం గాలిస్తున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే హనావూ సిటీలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.