మరో కుట్రకు తెరతీసిన డ్రాగన్ కంట్రీ

|

Sep 19, 2020 | 8:40 PM

వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఒక పక్క సైన్యం అనారోగ్యం పాలవుతున్నా భారత సరిహద్దుల్లో చైనా తన అక్రమాల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఒక పక్క చర్చలంటూనే డబుల్‌ గేమ్‌ ఆడుతోంది. ఇటీవలే గాల్వాన్‌ లో

మరో కుట్రకు తెరతీసిన డ్రాగన్ కంట్రీ
Follow us on

వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఒక పక్క సైన్యం అనారోగ్యం పాలవుతున్నా భారత సరిహద్దుల్లో చైనా తన అక్రమాల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఒక పక్క చర్చలంటూనే డబుల్‌ గేమ్‌ ఆడుతోంది. ఇటీవలే గాల్వాన్‌ లోయలో భారత సైనికులను పొట్టనబెట్టుకున్న డ్రాగన్‌ ఆర్మీ.. ఇప్పుడు మరో దురాగతానికి ఒడిగట్టింది. తమకు ఇబ్బందికరంగా మారిన భారత బలగాల నిఘాను అడ్డుకునేందుకు వీలుగా తూర్పు లఢఖ్‌లో ఉన్న పెట్రోలింగ్ పాయింట్లపై కన్నేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పదకొండు పెట్రోలింగ్‌ పాయింట్లను చైనా ఆర్మీ మూసేసినట్లు తాజా సమాచారం. భారత బలగాలు అటు వైపుగా వెళ్లకుండా చైనా తాత్కాలికంగా ఈ అడ్డుకట్ట వేసింది. కాగా, చైనా, భారత్‌ మధ్య ఆరునెలలుగా చర్చలు కొనసాగుతున్నా అందులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కనీసం యథాతథ స్ధితి కొనసాగిద్దామన్న భారత్‌ ప్రతిపాదనను సైతం పట్టించుకోకుండా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది డ్రాగన్ కంట్రీ.